పలురంగాల్లో నిర్ణయాత్మక పాత్రను పోషిస్తున్న మహిళల స్వావలంబన, సాధికారత కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అవిరళ కృషి చేస్తున్నారు. గత ప్రభుత్వాల్లో మహిళలు అనుకున్న పురోగతి సాధించలేదని గుర్తించిన సీఎం కేసీఆర్ మహిళల కోసం తెలంగాణ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు అమలుచేస్తున్నారు. మహిళల రక్షణ, పోషణకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారానే వారి అభివృద్ధి సాధ్యమని కేసీఆర్ నమ్మకం. అందుకే ఆరోగ్యలక్ష్మి, భరోసా కేంద్రాలు, ‘షీ’ టీమ్స్ వంటి పథకాలను అమలుచేయడం ద్వారా ‘మహిళా బంధువు’గా నిలిచారు. అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారని సీఎం కేసీఆర్ నమ్మి మహిళలకు అనేక అవకాశాలు కల్పిస్తున్నారు.
స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కేసీఆర్దే. దీంతో మార్కెట్, సింగిల్ విండో కమిటీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్పర్సన్లుగా మహిళలు రాజకీయాల్లో రాణిస్తున్నారు.
దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ఉమెన్ ఎంటర్ప్రైన్యూర్ హబ్ (వీ-హబ్) ద్వా రా ఎందరో మహిళలను వ్యాపారవేత్తలుగా, పారిశ్రామివేత్తలుగా తీర్చిదిద్దుతున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంది. ఆడబిడ్డ పుడితే భారం అనుకొని బాధపడే రోజులు ఆయన పుణ్యమాని పోయాయి. సర్కారు దవాఖానలో ఉచితంగా డెలివరీ చేసి.. కేసీఆర్ కిట్ అందిస్తున్నది. రూ.13 వేల ఆర్థికసాయం ఇస్తూ తల్లీబిడ్డను క్షేమంగా ఇంటివద్ద దింపుతున్నది. బిడ్డ పెరిగాక ఉన్నత చదువుల వరకు ఉచిత విద్యనందిస్తున్నది.
శిశువు నుంచి పండు ముసలి వరకు మహిళలందరికీ లబ్ధి చేకూరేలా సీఎం కేసీఆర్ పథకాల రూపకల్పన చేశారు. దీంతో ఆయన తండ్రిగా, మేనమామగా, సోదరుడిగా, మిత్రుడిగా మహిళల మనసుల్లో నిలిచిపోయారు. మహిళల సంక్షేమానికే మా తొలి ప్రాధాన్యమంటూ గతంలో ఎన్నో ప్రభుత్వాలు, పార్టీలు చెప్పుకొన్నాయి. కానీ అవి మాటలకే పరిమితమయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఇవ్వని హామీలను కూడా నెరవేరుస్తున్నారు. కుల, మత తారతమ్యాలు లేకుండా అమలవుతున్న పథకాలపై మహిళల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
మహిళలకు తాగునీటి కష్టాలను తీర్చడంలో ‘మిషన్ భగీరథ’ కీలక పాత్ర పోషిస్తున్నది. గతంలో తాగునీటి కోసం మహిళలు రోడ్లెక్కి ఖాళీ బిందెలతో ధర్నాలు చేసే పరిస్థితులుండేవి. ఇప్పుడు ఇంటింటికీ స్వచ్ఛమైన నీళ్లు వస్తున్నాయి. దీంతో ప్రజల ఆరోగ్యంతోపాటు మహిళల కష్టాలూ తీరాయి.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బాలికల కోసం వేర్వేరుగా గురుకుల పాఠశాలలు, ఇంటర్, డిగ్రీ కళాశాలలను ఏర్పాటుచేశారు. దీంతో పేద బాలికలకు ఆంగ్ల మాధ్యమంలో నాణ్యమైన విద్యాబోధన జరుగుతున్నది. దేశంలో మొదటిసారి ఎస్సీ, ఎస్టీ అమ్మాయిల కోసం 53 డిగ్రీ గురుకులాలు ఏర్పాటుచేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంది. ఇక స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కేసీఆర్దే. దీంతో మార్కెట్, సింగిల్ విండో కమిటీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్పర్సన్లుగా మహిళలు రాజకీయాల్లో రాణిస్తున్నారు.
మహిళల పురోగతికి కృషిచేస్తున్న ఆశా, అంగన్వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం వేతనాలను పెంచింది. వారికి ప్రభుత్వం ఉచితంగా స్మార్ట్ ఫోన్లను కూడా పంపిణీ చేస్తున్నది. ఇదంతా కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాకే అమలవుతున్నాయి. కేసీఆర్ పాలనలో అంగన్ వాడీ కేంద్రాల తీరు పూర్తిగా మారింది. వాటి ద్వారా గర్భిణులకు ఆరోగ్యలక్ష్మి పేరిట ఉచితంగా ఒక పూ ట ఆహారం, పౌష్టికాహారం అందిస్తున్నారు. 2015 జనవరి 1 నుంచి ఈ పథకం అమలవుతున్నది. గర్భిణులకు ఐరన్ టాబ్లెట్లు అందజేయడం, రక్తహీనత తగ్గించేందుకు, గుడ్లు, పాలు సైతం ఇస్తున్నారు.
అమ్మఒడి వాహనాలు అందుబాటులో ఉంచారు. తక్కువ బరువున్న పిల్లలపై కమ్యూనిటీ ఆధారిత సంరక్షణ చర్యలు తీసుకుంటున్నారు. పోషక అభియాన్, సమగ్ర బాలల సంరక్షణ పథకం, బాల సదనం వంటి కార్యక్రమాలు అమలవుతున్నాయి. సఖీ కేంద్రాలతో మహిళలను గృహహింస, మోసాల నుంచి రక్షిస్తున్నారు. బాల్య వివాహాలను అరికట్టడం, మహిళలకు ఆర్థిక స్వావలంబన, వరకట్న వేధింపులు వంటివాటిపై అవగాహన కల్పించడం, న్యాయపరమైన సలహాలు అందించడం వంటి చర్యలు తీసుకుంటున్నారు. మాతాశిశు సంరక్షణ కోసం మౌలిక వసతులు కల్పించారు. ఇలా ఎన్నో పథకాలతో మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు యావత్ తెలంగాణ మహిళా లోకం రుణపడి ఉన్నది.
-ఆలేటి రంగేశ్వరి శ్రీనివాస్
96660 06955