దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఎన్నేండ్లయింది? పట్టుగొమ్మల్లాంటి పల్లెల పరిస్థితి ఇంకా ఎందుకు బాగుపడలే ? కార్మిక, కర్షకులు ఇంకా అప్పుల్లోనే ఎందుకు కూరుకుపోతున్నరు..? బుక్కెడు బువ్వ కోసం నిరుపేదలు ఎందుకింకా తపనపడుతూనే ఉన్నరు? ఇంకెన్నడు మనం మారేది..? భవిష్యత్ తరాల గురించి ఆలోచించేది ? అలాంటి ఆలోచనవైపు అడుగులేస్తూ..భావితరాల బాగుకోసం బాటలు వేస్తున్న వారిని కనీసం గుర్తిస్తున్నామా..? పట్టణాల నుంచే కాదు.. పల్లెల్లోనూ సంపద సృష్టించవచ్చన్న ఆలోచనలు పట్టించుకొంటున్నామా..? ఓ సారి గుండెల మీద చెయ్యేసుకొని ఆలోచించుర్రి ! జనాల గురించి ఎవరు ఆలోచిస్తున్నరు.. స్వార్థం కోసం ఎవరు ఆలోచిస్తున్నరని..
ఒక కుటుంబం బాగు పడాలంటే.. ఇంటిపెద్ద ఆలోచన సరైనదై ఉండా లి. ఆయన ఆలోచనను బట్టే ఆ కుటుంబం అభివృద్ధి చెందడమా.. నాశనమవడమా అనే ది ఆధారపడి ఉంటుంది. ఇది ఎవరు కాద న్నా.. జగమెరిగిన సత్యం. అరవై ఏండ్లలో సాగు, తాగు నీరు, యాస, భాషల కోసం ఎంతగా కష్టపడ్డమో అందరికీ తెలుసు. ప్రపంచంలో ఎక్కడా లేని బతుకమ్మ లాంటి పండుగలను పట్టించుకున్న పాలకులు భూతద్దంలో చూసినా దొరకలే. మన ప్రాంతం, మన భాష, యాస, సంస్కృతులపై జరుగుతున్న అవమానాన్ని తట్టుకోలేక ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా బాటలువేస్తే.. ఆదరించడం పక్కనపెడితే అవమానాలకు గురిచేసిన్రు. గేలి చేసిన్రు. అయినా పట్టువిడవలే. చుట్టూ వేల మంది లేకున్నా.. ఒక్కడే అడుగుముందుకేసి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఊపిరి పోసిండు. ఎన్ని అవమానాలు ఎదురైనా సైన్యాన్ని తయారు చేసుకొని, అందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి.. దేశాన్ని తనవైపు తిప్పుకొని దశాబ్దాల కలను పదమూడేండ్లలో సాకారం చేసిండు కేసీఆర్.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణను నిషేధ పదంగా చూసిన నాయకుల ముందే తెలంగాణ రాష్ర్టాన్ని తీసుకొచ్చి తలెత్తుకునేలా చేసిండు. మరి.. ఆ పదమూడేండ్ల పోరాటం ఒక్కడి బాగు కోసం చేసిండా.. అరవై ఏండ్లు అణగదొక్కబడిన తెలంగాణ ప్రజల కోసం చేసిండా..? ఒక్క క్షణం కళ్లు మూసుకొని ఆలోచిస్తే తెలుస్తది.
కష్టపడి తెచ్చుకున్న రాష్ర్టాన్ని ఎవరి చేతిలోనైనా పెట్టి పక్కనుంటే.. కేసీఆర్కు వచ్చిన న ష్టం ఏం లేకుండే.. కానీ దశాబ్దాల కలను ఎవ రూ చులకనగా చూడొద్దని ప్రజల గురించి ఆలోచించిండు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఎంత గా కష్టపడ్డడో.. అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడాలని నిర్ణయించుకున్నాడు. అందుకు మరోసారి రాష్ర్టానికి పెద్దదిక్కుగా ఉండి అడుగు ముందుకేసిండు. అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తుండు. ఇప్పుడు దారిలో పడ్డ రాష్ట్రంపై గద్దల కండ్లు పడ్డయ్. దొంగ ఏడుపులు మొదలుపెట్టినయ్.
ఏడుస్తున్న పిచ్చోళ్లారా ఒక్కసారి ఆలోచించుర్రి..ఎనిమిదేండ్ల ముందు తెలంగాణలో సాగు విస్తీర్ణమెంత.. ఇప్పుడెంత అని? తెలంగాణ రాకముందు రాష్ట్రంలో ప్రాజెక్టుల నీటి నిల్వల సామర్థ్యమెంత? ఇప్పుడెంత? కేసీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయకముందు కరెంటు కోతలెట్లుండే..ఇప్పటి పరిస్థితేంది? మిషన్ భగీరథ నీరు ముద్దాడని ఇల్లున్నదా..? తెలంగాణ రాకముందు చెరువులెట్లుండే..ఇప్పుడెట్లున్న య్? గద్దల్లా రాష్ట్రం మీద పడి అరుస్తూ.. పిచ్చి కూతలు కూసే పిచ్చివాళ్లకు ఏం తెలుస్తది అభివృద్ధి గురించి.
కండ్ల ముందు కొడుకులుండి..బువ్వ కోసం ఎదురు చూసే ముసలోల్లకు తెలుస్తది ఆసరా పింఛన్ల విలువ. భర్త చనిపోయి.. పిల్లల్నెలా చదివించాలని బోరున విలపించిన తల్లులకు తెలుస్తది వితంతు పింఛన్ల విలువ. పైసల్లేక.. జాగ లేక.. ఇంట్లో ఎదుగుతున్న ఆడబిడ్డ పెండ్లి ఎట్ల చేయాలని మదనపడ్డ తల్లిదండ్రులకు తెలుస్తది కళ్యాణ లక్ష్మి విలువ. నిలువ నీడలేక.. బుక్కెడు బువ్వ కోసం కష్టపడ్డ వాళ్లకెరుక.. డబుల్ బెడ్రూం ఇండ్ల విలువ. ప్రమాదవశాత్తు ఇంటిపెద్ద సచ్చిపోతే.. కర్మకాండలకు కూడా డబ్బుల్లేని వాళ్లకెరుక రైతు బీమా విలువ.
రాష్ట్రం రాకముందు అర్థ్థరాత్రి బ్యాటరీ పట్టుకొని ఇంటిపెద్ద పొలం కాడికి పోతే.. ఎప్పుడొస్తాడా అని తెల్లారేదాక కంట్లో వత్తులేసుకుని ఎదురుచూసిన తల్లులకు తెలుసు.. 24 గంట ల కరెంటు విలువ. ఊర్లల్లో గుంట భూమి లేనోడు సచ్చిపోతే.. కాలేసేందుకు జాగలేక రం ది పడ్డ జనాలకెరుక స్మశాన వాటికల విలువ.. కండ్లముందు కృష్ణ, గోదావరి నీళ్లు పారుతు న్నా..సాగు, తాగు నీటి కోసం అరవై ఏండ్లు గోస పడ్డ జనాలకెరుక కాళేశ్వరం విలువ.. ఊళ్ల ల్లో చెరువులపై ఆధారపడ్డ జనాలకు తెలుసు మిషన్ కాకతీయ విలువ. ఊళ్లల్లో రూపాయి లేక కూలీ నాలీ చేసుకొనే దళిత కుటుంబాల కెరుక దళితబంధు విలువ. రూపాయి రూపా యి జమ చేసుకొని పుస్తెలమ్ముకొని బిడ్డ కోసం తపన పడ్డ నిరుపేద తల్లులకు తెలుసు సర్కారు ఆస్పత్రుల్లో ఫ్రీ డెలివరీ విలువ.. బిడ్డ పుడితే ఖర్చులకు రూపాయి లేక ఇబ్బందులు పడ్డ వాళ్లకెరుక.. పభుత్వం ఇచ్చే 13 వేల విలువ.
పట్నంలోనే చూసిన పార్కులు ఎవరి ఆలోచన వల్ల పల్లెల బాటపట్టినయ్.? ఎవరికోసం పల్లెల్లో ఓపెన్ జిమ్లు వచ్చినయ్? వానలు పడ్డంక.. దుక్కిదున్నేందుకు ఊళ్లలో మిత్తిలకు ఇచ్చే వారికోసం చూసే రైతులు.. ఇప్పుడు ఎవరి ఆలోచన వల్ల బ్యాంకు అకౌంట్ల వైపు చూస్తున్నరు? మన చుట్టూ కనిపిస్తున్న మార్పు ను.. ఎవరు కాదనగలరు. గుండెలమీద చేయి వేసుకుని చూస్తే.. తెలంగాణ కుటుంబం గురి ంచి ఆలోచన చేస్తున్నదెవరో తెలిసిపోతుం ది. ఒకప్పుడు పల్లెల్లో ఉపాధి ఏము ందన్న వాళ్లే.. ఇప్పుడు ఊర్ల్ల కు పోయి అక్కడి నుంచి రాననే పరిస్థితి ఎవరి వల్ల వచ్చింది. కేసీఆర్ ఆలోచించేది కుటుం బం కోసమే.. రాష్ట్ర ప్రజలందరినీ తన కుటుంబంగా చూసుకుంటుండు కాబట్టే.. ప్రతి ఒక్కరి కళ్లలో ఆనందాలు కనిపిస్తున్నయ్. ఒక్క ప్రాజెక్టు కట్టేందుకు 30,40 ఏండ్లు పడుతున్న ఈ కాలంలో ప్రపంచమే ఆశ్చర్యపోయేలా మూడు,నాలుగేండ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి.. సాగు నీటి సమస్య తీర్చిందెవరికోసం? ఆరోగ్య శ్రీ పథకం నిరుపేదలకు అండగా ఉంటుందని తెల్సి.. అలాగే కొనసాగించిన నాయకుడెవరు ? ప్రజలకు ఉపయోగపడే పథకాలకు.. తమ పేర్లు పెట్టుకోని వాళ్లెవరైనా ఉన్నరా.. పేరు కాదు సంక్షేమం కావాలని ఆలోచించినది ఎవరు? ఆయన ఆలోచన ఎంత గొప్పది.. ఓ సారి గుండెలమీద చెయ్యెసుకొని ఆలోచిస్తే తెలుస్తది.
తెలంగాణ యాస, భాష, పండుగలను చులకనగా చూసే రోజుల నుంచి.. బతుకమ్మ, దసరా అనగానే రాష్ట్రం వైపు చూసే రోజులు ఎవరి వల్ల వచ్చినయ్..? దేశంలో ఎక్కడా లేని ఈ ఆలోచనలు ఎవరి మేలు కోరి తీసుకొచ్చిండు కేసీఆర్.
గొల్లకుర్మల గోస తెలిసి.. గొర్రెల యూనిట్లనిచ్చి వాళ్లకు ఉపాధి కల్పించాలన్న ఆలోచన ఎవరిది? మన ఇంట్లో నలుగురం ఉన్నప్పుడు సదువుకోని వాళ్ల కోసం ఏదైనా ఉపాధి మార్గం గురించి ఇంటిపెద్ద ఆలోచించడా? బెస్తోళ్లు, తెన్గోళ్లకు చేపల పంపిణీ.. గౌడలకు ఈత వనా లు ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఎవరైనా చేసిన్రా? ఇదంతా కేసీఆర్ కుటుంబం కోసమే చేసిండా. తెలంగాణే తన కుటుంబం అనుకొ ని చేసిండా.? ఆయన అడుగులెవరికోసమో.. ఆలోచించలేకపోవడం ఎంత మూర్ఖత్వం? దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లయినా ఏ నాయకుడూ ఏ రాష్ట్రంలో అమలు చేయని, కనీసం ఊహకు కూడా అందని పథకాలకు ఆలోచన చేసి.అమలు చేస్తున్నదెవరు ? అన్నం పెట్టే అయ్యను యాది మరిస్తే ఎవరికీ నష్టమో ఆలోచించాలి.
డబ్బు ఐదేండ్లలో దేశంలో ఏ నాయకుడూ చేయని అభివృద్ధిని ఎనిమిదేండ్లలోనే చూపి స్తే.. మరో పది, పదిహేనేండ్లు అధికారమిస్తే? తెలంగాణవైపు దేశమంతా చూడదా? పది పైసల పనిచేసి వేల రూపాయల ప్రచారం చేసుకుంటున్న ఇప్పటినాయకులతో కేసీఆర్కు పోలి కా? ఓసారి యాదాద్రి వెళ్తే తెలుస్తది.. మరో వెయ్యేండ్లలో ఇంత గొప్ప ఆలయ నిర్మాణం సాధ్యమైతదా? శరవేగంగా సచివాలయ నిర్మాణం.. ప్రతి జిల్లా ల్లో సమీకృత కలెక్టరేట్ భవనాలు, జిల్లాకో పోలీసు కార్యాలయం, జిల్లాకో మెడికల్ కాలేజీ దిశగా అడుగులు. దేశంలో ఎనిమిదేండ్లలో ఇవ న్నీ ఏ రాష్ట్రంలోనైనా సాధ్యమైనయా? శోచాయించుండ్రి.
-నవీన్ కుమార్ రెడ్డి, 95818 88000