రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పలు కుల సంఘాలకు,సామాజిక సంస్థలకు ఆత్మగౌరవ భవన నిర్మాణాల కోసం ప్రభుత్వ భూమిని కేటాయించింది. అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ మహారాష్ట్ర మండల్ సంస్థకు కూడా ఉప్పల్ భగాయత్లో రెండెకరాల భూమిని కేటాయించారు. దీంతో మండల్ నాయకులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా తెలంగాణ మహారాష్ట్ర మండల్ జనరల్ సెక్రెటరీ, రిటైర్డ్ డీఎస్పీ అయిన ఎల్కే షిండే, ఛత్రపతి శివాజీ నవయువక్ మండల్ అధ్యక్షుడు, మండల్ ఉపాధ్యక్షులు మదన్ జాదవ్, మండల్ స్పోర్ట్స్ సెల్ కన్వీనర్ దిలిప్ జగతాప్ సంయుక్తంగా ‘నమస్తే తెలంగాణ’తో ముచ్చటించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి చెందుతున్నదని వారు అభిప్రాయపడ్డారు. మరే రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న పథకాల పట్ల ఆకర్షితులై మహారాష్ట్రలో కూడా ఎందరో ఇతర పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. కేసీఆర్ పాలనపై మండల్ నాయకుల అభిప్రాయం వారి మాటల్లోనే…
మూడు వందల ఏండ్ల కింద నుంచే మరాఠీ మాట్లాడే వివిధ కులాల వారు ఇక్కడ తెలుగు గడ్డపై జీవిస్తున్నారు. మరాఠా నాయకుడైన ఛత్రపతి శివాజీ అప్పట్లోనే కులీ కుతుబ్షాతో సంబంధాలు నెరిపారు. అప్పటినుంచి మార్వాడీలు తెలంగాణలోని వివిధ ప్రాం తాల్లో నివసిస్తున్నారు. మరాఠీ మాట్లాడే వారి సంస్కృతి, సంప్రదాయాలు వేరు. నిజాం పాలనలో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలుండేవి. మహారాష్ట్రలోని చంద్రపూర్, ఔరంగాబాద్ వరకు నిజాం పాలనలోనే ఉండేవి. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికీ మా బంధువులు ఉండటం, వారితో ఉన్న సంబంధ బాంధవ్యాల వల్ల తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రాకపోకలున్నాయి.
1969లో మహారాష్ట్ర మండల్ స్థాపన: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 1969లో మహారాష్ట్ర మండల్ను స్థాపించారు. మరాఠీ భాషీయుల సంక్షేమం కోసం మా సంస్థ పని చేస్తున్నది. అప్పటి ప్రభుత్వాలను భవన నిర్మాణం కోసం భూమి కేటాయించాలని కోరాం. అప్పుడు.. ఇప్పుడు.. అంటూ గత సీఎంలందరూ దాటవేస్తూ వచ్చారు. కానీ కేసీఆర్ మా కోరికను మన్నించారు. మా సంస్థ చేస్తున్న సేవలను గుర్తించారు. మా సంస్థకు ఉప్పల్ భగాయత్లో రెండెకరాల భూమి కేటాయించారు. అందు కు మేమందరం కేసీఆర్కు రుణపడి ఉంటాం. మాకే కాదు, మాలాంటి చాలా సంఘాలకు ఆత్మగౌరవ భవనాల నిర్మాణాల కోసం భూములు కేటాయించడం సంతోషించదగిన విషయం.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో మా పాత్ర: ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలోనూ మా మరాఠీలు కేసీఆర్కు అండగా నిలిచారు. సకలజనుల సమ్మె, వంటావార్పు లాంటి ఆందోళనల్లో పాల్గొ న్నాం. రాష్ట్రావతరణ తర్వాత కూడా రాష్ట్ర పునర్నిర్మాణంలో మహారాష్ట్రకు చెందిన విభిన్న వర్గాలు, జాతుల భాగస్వామ్యం ఉన్నది.
లింగ్విస్టిక్ మైనారిటీలకు గుర్తింపు: కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం లింగ్విస్టిక్ మైనారిటీలకు గుర్తింపునిచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం మమ్మల్ని సామాజికంగా, రాజకీయంగా గుర్తించింది. మరాఠీల సంస్కృతిని కాపాడేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ కూడా ఇచ్చారు. జాతీయస్థాయిలో ఓబీసీ జాబితాలో చేర్చడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. మహారాష్ట్రకు చెందిన వారికి తెలంగాణలో కూడా బీసీ సర్టిఫికెట్లను మంజూరు చేస్తున్నారు.
కేసీఆర్ దూరదృష్టి గల నాయకుడు: కేసీఆర్ దూరదృష్టి గల నాయకుడు, దయామయుడు. తొమ్మిదేండ్లలోనే ఎండిన పొలాల్లో నీళ్లు పారించారు. పొట్ట చేత పట్టుకొని పోయే వలసలు తగ్గిపోయా యి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్, భవన నిర్మాణాలు, చిరు వ్యాపారాలు, ట్రాన్స్పోర్టు లాంటి రంగాల్లో ఉద్యోగావకాశాలు పెరగటం తో గ్రామీణులు కూడా హైదరాబాద్కే వస్తున్నారు. మహారాష్ట్రకు చెందినవారు ఎక్కువగా ఇక్కడ హోటళ్లు , కూరగాయల అమ్మకం, ట్రాన్స్పోర్ట్ బిజెనెస్.. లాంటివాటితో జీవనం గడుపుతున్నారు. అంతేకాదు హైదరాబాద్లో బీహార్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ రాష్ర్టాల నుంచి వచ్చిన వారెందరో పనులు చేసుకుంటున్నారు.
ఐటీ ఉద్యోగుల ప్రాధాన్యం హైదరాబాద్కే: హైదరాబాద్లో అంతర్జాతీయ ఐటీ కార్యాలయాలు ఏర్పడటంతో సాఫ్ట్వేర్ ఉద్యో గం చేసే చాలామంది మహారాష్ట్ర వారు ఇక్కడికే వస్తున్నారు. పుణా, బెంగళూరుల్లో పనిచేస్తున్న ఎంతోమంది టెకీలు కూడా హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ చేసుకుని వస్తున్నారు. ఐటీ మంత్రి కేటీఆర్ కృషి వల్ల హైదరాబాద్లో ఐటీరంగం దూసుకుపోతున్నది.
ఆరోగ్య సేవలూ బాగున్నాయి: ప్రభుత్వపరంగానే కాకుండా ప్రైవేటు సూపర్ స్పెషాలిటీ దవాఖానలు ఎక్కువగా ఉండటం వల్ల చాలామంది ఇతర రాష్ర్టాల వాళ్లు చికిత్స కోసం హైదరాబాద్నే ఎంచుకుంటున్నారు. ప్రభుత్వ దవాఖానలు కూడా నాణ్యమైన వైద్య సేవలందిస్తున్నందున, పక్క రాష్ర్టాల నుంచి కూడా పేద ప్రజలు ఇక్కడికి వస్తున్నారు.
మరాఠీ రైతులపై తెలంగాణ రైతు సంక్షేమ పథకాల ప్రభావం: రైతుబంధు, రైతుబీమా పథకాలు మరాఠీ రైతులపై చాలా ప్రభావం చూపుతున్నాయి. మహారాష్ట్రీయులు తెలంగాణ సరిహద్దుల్లో భూములు కొనుక్కున్నారు. వారికి ఇప్పుడుఎకరాకు రూ.10 వేల రైతుబంధు వస్తున్నది. ఎవరైనా చనిపోతే రైతుబీమా కింద రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందుతున్నది. ఈ రెండు పథకాలు మహారాష్ట్ర రైతుల ను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ సారి మహారాష్ట్ర రైతులు బీఆర్ఎస్కే ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు. అందుకే పెద్దఎత్తున అన్ని పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారు. వచ్చే ఎన్నికల్లో మహారాష్ట్రలో కూడా బీఆర్ఎస్ జెండా రెపరెపలాడుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు.
ఇంటర్వ్యూ:ఎం.నాగశేషకుమార్