పార్టీ పార్లమెంటరీ బోర్డు నుంచి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, మధ్యప్రదేశ్ సీఎం శివ్రాజ్సింగ్ చౌహన్కు బీజేపీ ఉద్వాసన పలికింది. పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి, కేంద్ర ఎన్నికల కమిటీల నుంచి కూడా వారిద్దరినీ సాగనంపింది. మోదీ-షా ప్రాబల్యం కలిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి ఈ ఇద్దరు సీనియర్ నాయకులను తొలగించడానికి గల కారణాలు విశ్లేషించమని ‘ది ఆర్ఎస్ఎస్- ఐకాన్స్ ఆఫ్ ది ఇండియన రైట్ అండ్ నరేంద్ర మోదీ-ది మేన్’ పుస్తక రచయిత నిలాంజన్ ముఖోపాధ్యాయను ‘రెడిఫ్.కామ్’ ప్రతినిధి సయ్యద్ ఫిర్దౌస్ కోరారు. ఆ ఇంటర్య్యూ విశేషాలు మీ కోసం..
బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి నితిన్ గడ్కరీని తొలగించడాన్ని మీరెలా విశ్లేషిస్తారు?
కేంద్రీకృత నాయకత్వ బలాన్ని తక్కువ చేసి చూపేందుకు నాటకీయంగా తీసుకున్న ప్రక్షాళన నిర్ణయం ఇది. ప్రధాని నరేంద్ర మోదీ అసమ్మతిని అస్సలు భరించలేరు. పార్టీ పనితీరుకు సంబంధించి కొన్ని అంశాల్లో గడ్కరీ అసంతృప్తిగా ఉన్నట్లు ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి తెలుస్తున్నది. కాబట్టి పార్లమెంటరీ బోర్డు నుం చి తప్పించడం ద్వారా పార్టీలో ఆయన స్థానాన్ని మోదీ ఒక మెట్టు కిందకు తగ్గించారు.
మరి బీజేపీ పార్లమెంటరీ బోర్డులో రాజ్నాథ్సింగ్ ఇంతకాలం ఎలా మనుగడ సాగించగలిగారు?
రాజ్నాథ్సింగ్ ఆ బోర్డులో ఎంతకాలం ఉంటారో చూద్దాం. ప్రస్తుత పరిస్థితుల్లో యూపీ నుంచి ఆయన లాంటి బలమైన నాయకుడు ఉండటం అవసరం. యోగి ఆదిత్యనాథ్ను పార్లమెంటరీ బోర్డులోకి తీసుకురావాలనుకోవడం లేదు. శివ్రాజ్సింగ్ చౌహాన్కు ఉద్వాసన పలకడం ద్వారా పార్టీకి చెందిన వేరే ఏ ముఖ్యమంత్రి పార్లమెంటరీ బోర్డులో సభ్యుడు కాలేడనే సంకేతాన్ని అధి నాయకత్వం పార్టీ శ్రేణులకు పంపించింది. యోగి వచ్చే ఐదేండ్లు యూపీపైనే దృష్టి పెట్టాలని మోదీ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబ పార్టీగా మారినట్లు ఇప్పుడు బీజేపీ కూడా మోదీ పార్టీలా మారిపోనుందా?
2015లో జరిగిన బీహార్ ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక బీజేపీ సీనియర్ నాయకులు అద్వానీ, జోషి, శాంతకుమార్, యశ్వంత్లు కలిసి పార్టీ అధ్యక్షుడు అమి త్ షాకు ఒక లేఖ రాశారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం తగ్గిపోవడం, కుమ్ములాటలు పెరిగిపోవడంపై ఆ లేఖలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశా రు. కానీ ఆ పార్టీ అధినాయకత్వం ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపట్టలేదు. పైగా తన నిరంకుశ విధానాలను కొనసాగించింది.
బీజేపీలో ప్రతి నాయకుడు తప్పనిసరిగా మోదీ భజన చేస్తే తప్ప మనుగడ సాగించలేని పరిస్థితి ఉన్నట్లు కనిపిస్తున్నది. ఇది నిజమేనా?
ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా మోదీ లాంటి నాయకుడిని ఆరాధించే భావన బాగా ఎక్కువైందని రామచంద్ర గుహ తాజాగా కరణ్ థాపర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. రామచంద్ర గుహ చెప్పిన విషయం గురించి భారతీయులు తీవ్రంగా ఆలోచించాలి. నరేంద్ర మోదీ కోరుకున్నది మాత్రమే ఈ దేశంలో జరుగుతున్నది. తన అభిమతానికి భిన్నంగా బీజేపీ నాయకులు ఎవరైనా ప్రవర్తిస్తే ఉపేక్షించే పరిస్థితిలో ఆయన లేరు. గడ్కరీ లాం టి అగ్ర నాయకులే మోదీని విమర్శించి నిలబడలేకపోయారు. అలాంటప్పుడు చోటా, మోటా నాయకుల పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి.
బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి గడ్కరీని సాగనంపడంపై ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్ మోహన్ భగవత్ ఏమీ స్పందించలేదు ఎందుకని?
ఆర్ఎస్ఎస్ తన సిద్ధాంతానికి పూర్తి భిన్నంగా గత ఎనిమిదేండ్లుగా బీజేపీ అధినాయకత్వానికి విధేయంగా ఉంటున్నది! తమ ప్రవర్తనను సరిదిద్దుకోవడంలో ఆ సంస్థ ఆలస్యం చేసింది. ఆర్ఎస్ఎస్తో నితిన్ గడ్కరీకి అనుబంధం ఎక్కువ. 2009లో రాజ్నాథ్ సింగ్ తర్వాత పార్టీ అధ్యక్ష పదవికి ఎవరిని ఎంపిక చేయాలనుకున్నప్పుడు, మోహన్ భగవత్ గడ్కరీని అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టారు. ఈ విషయాన్ని మనం మరచిపోకూడదు. ఇప్పుడు గడ్కరీకి ఉద్వాసన పలకడం కూడా ఆర్ఎస్ఎస్ అధినాయకత్వానికి, మోహన్ భగవత్కు బీజేపీ అధినాయకత్వం ఒక సందేశం పంపినట్లయింది. వ్యక్తి కంటే సంస్థకే ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుందని ఆర్ఎస్ఎస్ భావిస్తుంది. కానీ ప్రస్తుతం ఆ విషయం తారు మారైంది. వ్యవస్థల కన్నా, సంస్థల కన్నా వ్యక్తే ప్రధానమయ్యాడు.