కన్నతల్లికి గంజి పోయనోడు.. చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తనని అన్నడట అనే నానుడి, ప్రస్తుతం మునుగోడు ఎన్నికల్లో హాట్టాపిక్గా మారింది. అక్కడి నాయకులు తమ రాజకీయ ప్రత్యర్థులపై ఈ నానుడిని కాస్త అటు ఇటుగా మార్చి ప్రయోగిస్తున్నారు. ‘నియోజకవర్గం ముఖం చూడనోడు.. ఇంటింటికి బంగారం పంచుతానన్నడంట’ అని పరస్పరం విమర్శించుకుంటున్నారు. తనను ఉద్దేశించే అంటున్నారని అక్కడి అభ్యర్థులు ఎవరంతకు వారే అన్వయించుకుంటూ, భుజాలు తడుముకుంటుండగా, బీజేపీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డి మాత్రం తనను ఉద్దేశించే ఈ మాట అంటున్నారని ఉలిక్కిపడుతున్నట్టు చెబుతున్నారు.
– వెల్జాల