ఉద్యమ సమయంలో ప్రజల కష్టాలను స్వయంగా చూసిన ముఖ్యమంత్రి కేసీఆర్..ఆ కష్టాలను దూరం చేయడానికి అహర్నిశలు కృషిచేస్తున్నారు. స్వరాష్ట్ర సాధన కోసం 14 ఏండ్లపాటు సాగిన పోరాటంలో ప్రజల సాదకబాధకాలను స్వయంగా చూసి చలించారు. పోరాట కార్యక్రమాల్లో భాగంగా ఉమ్మడి వరంగల్జిల్లా నెల్లికుదురు మండలం బాలాజీనాయక్ తండాలో కేసీఆర్ పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టారు. ఆ సమయంలో గిరిజనుల జీవితాలను చూసి చలించిపోయారు. గిరిజనుల బతుకులు మారాలంటే స్వరాష్ట్రం సాధించటమొక్కటే మార్గమని ఆకాంక్షించారు. ఆ ఆకాంక్షకు అనుగుణంగా నేడు స్వరాష్ట్రంలో గిరిజనుల కలలను నిజం చేస్తున్నారు. అందులో భాగమే రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ నగరంలో గిరిజనుల ఆత్మగౌరవ భవనాల నిర్మాణం, గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లను అమలుచేయడం.
గిరిజనులు సమాజంలో తలెత్తుకొని బతికేలా వారికి పాలనలో ప్రాధాన్యం ఇస్తున్నారు. స్వరాష్ట్రంలో సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్, గిరిజన పిల్లల కోసం గురుకుల విద్యను తీసుకువచ్చి వారికి కార్పొరేట్ స్థాయిలో విద్యావకాశాలు కల్పిస్తున్నారు. గ్రామాలకు దూరంగా, అడవికి దగ్గరగా జీవిస్తున్న గిరిజనులకు సమాజంలో సమాన అవకాశాలు కల్పించబడాలని, అందుకు వారి జనాభాకు తగినట్లుగా రిజర్వేషన్లు వర్తింపజేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావించారు. పద్నాలుగేండ్ల పోరాట సమయంలో తాను స్వయంగా చూసిన గిరిజనుల స్థితిగతులను మార్చాలని కృతనిశ్చయంతో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనులకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు.
75 ఏండ్ల స్వాతంత్య్ర భారతదేశంలో అమలుకు నోచు కోని తండాలను గ్రామపంచాయతీలు చేయాలన్న ప్రధాన డిమాండ్ను కేసీఆర్ చేసి చూపించారు. గతంలో అధికారం లో ఉన్న ఏ ప్రభుత్వం తండాలు, గూడేలకు గ్రామ పంచాయతీ హోదా కల్పించలేకపోయాయి. కానీ రాష్ట్రంలోని 3,1 46 తండాలు, గూడేలను గ్రామపంచాయతీలుగా మార్చి కేసీఆర్ చరిత్రలో నిలిచారు. అదేవిధంగా 27,682 మంది గిరిజనులకు స్థానిక ప్రజాప్రతినిధులుగా అవకాశమిచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దే. గిరిజన పిల్లల విద్యాభివృద్ధి కోసం 92 ఎస్టీ ప్రత్యేక గురుకులాల ఏర్పాటుతోపాటు, యువ గిరిజన పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు సీఎం ఎస్టీఈ పథకాన్ని అమలుచేస్తున్నారు. మేడారం జాతరకు అధికారిక హోదాతోపాటు, సమ్మక్క మ్యూజియాన్ని ఏర్పాటుచేసి గిరిజన సంస్కృతిని భవిష్యత్ తరాలకు తెలిసేలా కృషిచేస్తున్నారు. గిరిజనుల ఆత్మగౌరవ చిహ్నాలుగా హైదరాబాద్లోని బంజరాహిల్స్లో కుమ్రంభీం, సంత్ సేవాలాల్ భవనాలను నిర్మించి, ప్రారంభించారు.
శతాబ్దాల నుంచి ఎన్నో కష్టాలకు గురై ఆర్థిక, సామాజిక, రాజకీయ అవకాశాలకు నోచుకొని గిరిజనుల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ అహరహం కృషిచేస్తున్నారు. తెలంగాణలో గిరిజనుల జనాభా అధికమన్న విషయం అందరికీ తెలిసిందే. ఇటువంటి సందర్భంలో గిరిజనులకు ప్రభుత్వంలో, ప్రభుత్వం కల్పించే అవకాశాల్లో న్యాయం జరుగాలంటే రిజర్వేషన్ పెంచాలని చెల్లప్ప కమిటీ సిఫారసు చేసింది. ఆ సిఫారసును పరిగణనలోకి తీసుకొని, తెలంగాణ ఏర్పాటుకాగానే గిరిజనులకు రిజర్వేషన్ పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఆరేండ్ల కిందట చేసిన ఈ అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రానికి పంపితే నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం కనీసం స్పందించలేదు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేయలేదు. కేంద్రం గిరిజనుల పట్ల వ్యవహరిస్తున్న తీరును ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు ఎండగడుతూ వస్తున్నారు. రిజర్వేషన్ల పెంపుపై కేంద్రం చెప్పే సాకులను నిలదీస్తూ గిరిజనులకు 6 శాతంగా ఉన్న రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుతూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం పట్ల రాష్ట్రంలోని గిరిజన ప్రజానీకం సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నది.
బిర్సా ముండా, కుమ్రంభీం, సంత్ సేవాలాల్ మహారాజ్, థాన్ నాయక్లు గిరిజనుల జీవితాల్లో మార్పు కోసం అనేక పోరాటాలు చేశారు. ఆ పోరాటాలను సైతం అధ్యయనం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ వారి ఆశయాల బాటలో, గిరిజనుల సమగ్రాభివృద్ధి కోసం కృషిచేస్తున్నారు. తెలంగాణతోపాటు యావత్ దేశంలో ఉన్న గిరిజనులకు న్యాయం జరుగాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ మరో పోరాటానికి నాయకత్వం వహించాల్సిన సమయం ఆసన్నమైంది.
మానవాభివృద్ధికి చిహ్నాలు వ్యవసాయం, విద్య, ఆరోగ్య రంగాలు. ఈ మూడు రంగాలు సమపాళ్లలో అభివృద్ధిని సాధిస్తేనే.. ఆ సమాజంలో నివసిస్తున్న ప్రజల ప్రగతి మెరుగుపడుతుంది. భారతదేశం మొదటినుంచి వ్యవసాయిక దేశం. కనుక రైతులు, రైతుల ప్రభుత్వాలు ప్రాథమికంగా పనిచేయాల్సి ఉంటుంది. రైతుల అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో ప్రభుత్వాలు పనిచేయకపోవడం వల్లనే వ్యవసాయం ఆగమై లక్షలాదిమంది రైతుల బతుకులు ఛిద్రమైపోయాయి. దేశంలో వ్యవసాయం అంటేనే భయపడే స్థాయికి ఈ రంగాన్ని తీసుకువచ్చారు గత పాలకులు. ఆత్మహత్యలు, ఆకలిచావులు లేని రాష్ర్టాలు లేవని అనేక నివేదికలు చెప్తున్నాయి. కొత్తగా ఏర్పడిన స్వరాష్ట్రంలో వ్యవసాయం దండుగ కాకుండా ఒక పండుగలా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ బృహత్తర పథకాలను అమలు చేస్తున్నారు. ఉమ్మడి పాలన నాటి పరిస్థితులు తెలంగాణలో కనిపించకూడదని రైతుల కోసం రైతుబంధు, రైతు బీమా, రుణమాఫీ, 24 గంటల నిరంతర ఉచిత, నాణ్యమైన విద్యుత్ వంటి పథకాలకు రూపకల్పన చేసి అమలుచేస్తున్నారు. ఈ పథకాల అమ లులో విజయవంతమైన తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలో కేంద్ర ప్రభుత్వంతో సహా ఇతర రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకుంటు న్నాయి. వ్యవసాయరంగ అభివృద్ధి కోసం తెలంగాణ చేస్తున్న కృషిని యావత్ ప్రపంచమే అభినందిస్తున్నది.
బిర్సా ముండా, కుమ్రంభీం, సంత్ సేవాలాల్ మహారాజ్, థాన్ నాయక్లు గిరిజనుల జీవితాల్లో మార్పు కోసం అనేక పోరాటాలు చేశారు. ఆ పోరాటాలను సైతం అధ్యయనం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ వారి ఆశయాల బాటలో, గిరిజనుల సమగ్రాభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. తెలంగాణతోపాటు యావత్ దేశంలో ఉన్న గిరిజనులకు న్యాయం జరుగాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ మరో పోరాటానికి నాయకత్వం వహించాల్సిన సమయం ఆసన్నమైంది. క్షేత్రస్థాయిలో గిరిజనులు, ఆదివాసీలు అంతకుమించి సబ్బండ వర్గాల సమస్యలు తెలిసిన కేసీఆర్ దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తారనే విశ్వాసం ప్రజల్లో ఉన్నది. అందుకే యావత్ దేశం ఆయ న కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నది.
(వ్యాసకర్త: మహబూబాబాద్ శాసనసభ్యులు)
బానోత్ శంకర్ నాయక్