భారతదేశ రాజకీయాలను గమనిస్తే ఇన్నేండ్ల దేశ పాలనలో జాతీయ పార్టీలు మాత్రమే చక్రం తిప్పుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం వంటి పార్టీలే దేశ రాజకీయాలు చేస్తున్నాయి. ఇవన్నీ దాదాపుగా ఉత్తరాది మూలాలు ఉన్నవే కావటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే, దక్షిణ భారతదేశం నుంచి తెలంగాణ ముద్దుబిడ్డ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దేశ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిపోయింది.
ప్రస్తుతం దేశాన్ని పాలిస్తున్న బీజేపీ ఎనిమిదేండ్ల నుంచి అధికారంలో ఉంది. మోదీ పాలన, ఆయన అవలంబిస్తున్న విధానాలు ఫాసిజాన్ని తలపిస్తున్నాయి. ఒకపక్క దేశంలో ఆర్థిక పరిస్థితులు రోజు రోజుకి దిగజారిపోతున్నాయి. అయినప్పటికీ ఆ సంగతి పట్టించుకోని ప్రధాని ప్రాంతీయ పార్టీలపై దృష్టి పెట్టి, వాటిని దెబ్బతీసే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు. పరిపాలనను గాలికి వదిలేసిన మోదీ జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలపై, ఎమ్మెల్యేల కొనుగోలుపైనే తన శక్తియుక్తులు వినియోగిస్తున్నారు. గత ఎనిమిదేండ్ల ఆయన పాలన ఎలా ఉందని పరిశీలిస్తే.. దేశ చరిత్రలో ఎన్నడూ చూడనంతటి రూపా యి పతనం, పెద్ద నోట్ల రద్దు, ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణ వంటివి కనిపిస్తాయి. ప్రజలను, నిరుపేదలను పట్టించుకోని మోదీ కార్పొరేట్ శక్తులను అందులోనూ తన సన్నిహితుల సంపద అమాంతంగా పెంచే చర్యలు మాత్రం తీసుకుంటున్నారు.
దేశంలో విద్య, వైద్యరంగాలు కునారిల్లుతున్నాయి. కొవిడ్ సమయంలో సరైన వైద్యం అందక ప్రజలు అల్లాడిపోయారు. ఎన్నో రాష్ర్టాలలో ఆక్సిజన్ సరఫరా లేక, కరోనాతో చాలామంది చనిపోయారు. ఇదే అదునుగా కార్పొరేట్ హాస్పిటళ్లు యథేచ్ఛగా ఫీజుల భారం మోపాయి. ఇంత జరుగుతున్నా మోదీ ప్రభుత్వం అటు ప్రజలను ఆదుకునే ప్రయత్నంగానీ, ఇటు కార్పొరేట్ హాస్పిటళ్లను నియంత్రించే పని గానీ చేయలేదు. ఇటువంటి ఆపత్కర సమయంలో సినీ నటుడు సోనూ సూద్ తన స్వంత డబ్బులతో ప్రజలకు
సేవాకార్యక్రమాలు చేస్తుంటే.. చూసి జీర్ణించుకోలేక మోదీ ప్రభుత్వం ఆయనపై ఆదాయం పన్ను దాడులు నిర్వహింపజేసింది.
ఇదీ ఆయన పాలన తీరు. ఇక మోదీ ఆకస్మికంగా నోట్ల రద్దు ప్రకటించి.. కోట్లాది ప్రజానీకాన్ని అనేక ఇబ్బందులకు గురి చేశారు. విదేశాల నుంచి నల్లధనం తీసుకొస్తానని, ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తా అని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. నేటి వరకు ఏ ఒక్కరికి చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు. ఈ వైఫల్యాల నుంచి జనం దృష్టి మళ్లించేలా మాయమాటలు చెబుతూ ప్రజలను ఇంకా అగాధంలోకి నెట్టి వేస్తున్నారు.
మరోపక్క 60 ఏండ్లపాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్పార్టీ. మోదీని ఎదుర్కోవటంలో పూర్తిగా విఫలమైంది. తన పాలనలో ప్రజలకు ఒక ప్ర త్యామ్నాయాన్ని చూపలేకపోయింది. దీంతో ఆ పార్టీకి దేశంలో పట్టు సడలింది. అధికారంలో ఉన్న అనేక రాష్ర్టాలు కాంగ్రేస్ చేజారిపోయాయి. కనీసం చట్టసభల్లోనూ బలమైన పత్రిపక్షంగా నిలవలేకపోతున్నది. ఈ నేపథ్యంలో, ప్రస్తుతం బీజేపీని ఢీ కొట్టాలంటే బల మైన నాయకుని అవసరం ఉన్నది. ఆ నాయకుడు అధి కార పార్టీని ఎదుర్కొవడంతో పాటు ప్రజలకు అవసరమైన సంక్షేమ ఫలాలు అందించగలిగిన వాడయి ఉండాలి. ఆ లక్షణం ఉన్న నాయకుడు కేసీఆర్ ఒక్కరే.
జై తెలంగాణ అన్న ఒకే ఒక్క నినాదంతో కోట్లాది మం దిని ఉద్యమానికి కదిలించిన శక్తి ఆయన సొంతం. రేపు దేశానికి సుపరిపాలనతో ప్రజా సంక్షేమం అందిం చడం కేసీఆర్కే సాధ్యం. తెలంగాణలో కేసీఆర్ తీసుకొచ్చిన ప్రభు త్వ పథకాలుగాని, అభివృద్ధిగాని ఇందుకు నిదర్శనం. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను కేసీఆర్ అమలు చేస్తున్నారు. రైతు బంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, మిష న్ కాకతీయ, మిషన్ భగీరథ, హరితహారం వంటి అనేక పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్న ఘనత కేసీఆర్ది. దీనిని యావత్ దేశ ప్రజానీకం గమనిస్తున్నది. మిగతా రాష్ర్టాల ప్రభుత్వాలు కూడా తెలంగాణను స్ఫూర్తిగా తీసుకుంటున్నాయి. ప్రాంతీయ పార్టీలు అన్నీ కేసీఆర్తో జతగట్టి దేశ రాజకీయాల్లో అద్భుతమైన మార్పునకు నాంది పలకాలి. ఎనిమిదేం డ్ల పాలనలో ఎన్నో అద్భుతాలు చేసిన ఘనత కేసీఆర్ది అయితే, అదే ఎనిమిదేండ్ల పాలనలో దేశానికి ఎన్నో నష్టాలు తెచ్చిన చరిత్ర బీజేపీ మోదీది. ప్రజలందరూ ఈ తేడాను గుర్తించాలి. కేసీఆర్కు అండగా నిలవాలి. జై కేసీఆర్.
(వ్యాసకర్త: న్యాయవాది)
-కిరణ్కుమార్ ఫిషర్
79893 81219