ప్రపంచంలోనే సర్వసత్తాక, ప్రజాస్వామిక ఫెడరల్ రాజ్యాంగవ్యవస్థను కలిగిన దేశం మనది. ఇంత గొప్ప రాజ్యాంగ వ్యవస్థను కలిగి ఉన్నా.. దేశం అభివృద్ధికి ఆమడదూరంలోనే నిలిచింది. ఇన్నేండ్లు పాలించిన ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం, గ్రామీణ ఆర్థికాభివృద్ధిని పట్టించుకున్న పాపాన పోలేదు. దేశం ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రధానంగా ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం, వ్యవసాయరంగం క్షీణత, రైతుల ఆత్మహత్యలు, మహిళలపై లైంగికదాడులు, దోపిడీ దళారీవ్యవస్థ ముఖ్యమైనవి. ఇలాంటి వ్యవస్థలో మార్పు రావాలంటే దేశానికి సమర్థవంతమైన, ఫెడరల్స్ఫూర్తి కలిగిన నాయకుడి అవసరం ఉన్నది.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడుస్తున్నా ఇంకా మన దేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉన్నది. దీనికి ప్రధాన కారణం రాజకీయ, ఆర్థిక దోపిడీ. రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు బ్యాంకుల నుంచి లక్షల కోట్లు అప్పుగా తీసుకొని ఎగవేస్తున్నారు. అప్పులు చెల్లించకుండా బ్యాంకులను ముంచి దేశ సరిహద్దులు దాటేస్తున్నారు. అటువం టి అవినీతిపరులకు ఈ దేశ పాలకులు అండగా నిలుస్తున్నారు.
ఒక సామాన్య రైతు, ఒక రోజువారీకూలీ బ్యాం కు నుంచి అప్పు తీసుకోవాలంటే సవాలక్ష ప్రశ్నలు. అయినా ఇచ్చేది కొద్దో గొప్పో మాత్రమే! సామాన్యులు తీసుకున్న అప్పును సకాలంలో తీరుస్తున్నా వారికి బ్యాంకుల నుంచి వేధింపులు తప్పవు. అదే సమయంలో లక్షల కోట్ల రూపాయలు అప్పుగా తీసుకొని దేశ సరిహద్దులు దాటుతున్న వారినుంచి ఎలాంటి రికవరీ చేయకపోగా, వారి అప్పులను ఏక మొత్తంలో మాఫీ చేయడం ఈ దేశ రాజకీయ దుస్థితికి అద్దం పడుతున్నది. ఆరుగాలం చెమటోడ్చి పం డించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, అకాల వర్షాలకు, గతితప్పిన వాతావరణానికి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని రైతులు నెత్తీ నోరు కొట్టుకుంటున్నారు. అయినప్పటికీ కేం ద్రం రైతుల పట్ల కనికరం లేకుండా వ్యవహరిస్తున్న ది. నెలల తరబడి దీక్షలు చేసినా, తనువులు పణం గా పెట్టినా కనికరించడం లేదు. అదే బడా పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు తీసుకున్న అప్పులు చెల్లించకపోయినా వారికి తిరిగి అప్పులు ఇస్తున్నది. ఇలాంటి అసమానతలు తొలిగిపోవాలంటే ఒక నిర్దిష్టమైన పరిపాలనా వ్యవస్థ, ఫెడరల్ రాజ్యాంగ వ్యవస్థను పటిష్ఠపరిచే రాజకీయవ్యవస్థ ఈ దేశానికి అవసరం.
సామాజిక అసమానతలు, గ్రామీణ నిరుద్యోగ నిర్మూలనకు వ్యవసాయరంగం, కుటీర పరిశ్రమ లు, కులవృత్తులు, వ్యవసాయరంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. దానికోసం గ్రామీణ నీటి వనరులను పరిరక్షించాలి. 70 శాతం వృథాగా పోతున్న నీటిని సద్వినియోగపరచుకొని బీడుభూములకు మళ్లించాలి. బంగారు పంటలు పండించే దిశగా అడుగులు పడాలి. దీనికోసం ఒక సమర్థవంతమైన రాజకీయ నాయకుడు రావాలి. మారుతున్న కాలానికనుగుణంగా వ్యవసాయ రంగంలో కూడా ఆధునిక యాంత్రీకరణ ప్రవేశపెట్టాలి. ఈ దేశంలో ఉన్న జనాభాకు సరిపడా వ్యవసాయ ఉత్పత్తులను పెంచేందుకు రెండో హరిత విప్లవాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. దీని కి చిత్తశుద్ధితో కూడిన రాజకీయవ్యవస్థ దేశానికి అవసరం. 1991లో వచ్చిన సరళీకరణ నూతన ఆర్థిక విధానం గ్రామీణ ఆర్థికవ్యవస్థను పూర్తిగా ప్రభావి తం చేసింది. ఇప్పటికైనా కేంద్రం గ్రామీణ నిరుద్యో గ సమస్యను పరిష్కరించడానికి ఉపాధి కల్పనకు దోహదపడే కార్యక్రమాలు చేపట్టాలి. మార్పునకు అనుగుణంగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి వ్యవసాయరంగాన్ని బలోపేతం చేయాలి. తద్వారా ఉత్పాదకరంగాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉన్నది. దీనికి గ్రామీణ వ్యవస్థ మీద, వ్యవసాయంరంగం మీద పూర్తి అవగాహన ఉన్న రాజకీయ నాయకుడు తప్పనిసరి అవసరం.
సమాజంలో జరుగుతున్న దోపిడీ వ్యవస్థను, కుళ్లు రాజకీయాలను సమూలంగా మార్చడం కోసం విలువలతో కూడుకున్న రాజకీయ వ్యవస్థ అవసరం. దానికోసం నీతి, నిజాయితీతో కూడిన నాయకత్వం అవసరమని దేశ ప్రజలు భావిస్తున్నా రు. ప్రపంచ జనాభాలో రెండో స్థానం, ఆర్థిక పరంగా 5వ స్థానంలో ఉన్న భారతదేశం అదేస్థా యిలో గుర్తింపు పొందాలంటే దేశంలో ఫెడరల్ రాజ్యాంగవ్యవస్థకు పునాదులు పడాలి. దేశంలో ప్రధానంగా ఒకే విధమైన వ్యవసాయవిధానం, ఒకే రకమైన పంట ధరలుండాలి. ఒకే దేశం ఒకే ధర అన్నట్టుగా పంటల ధరలను నిర్ణహించాలి. అప్పుడే దేశ రైతాంగం అద్భుత ప్రగతిని సాధించే అవకాశం ఉంటుంది. కానీ దేశంలో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకొని ముందుకు పోగల సమర్థవంతమైన నాయకత్వ లోటు కనిపిస్తున్నది. ఆ నాయకత్వలేమినే నేడు దేశం అన్ని రంగా ల్లో వెనుకబడిపోవడానికి కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
జాతీయ గౌరవాన్ని పెంపొందించే విధంగా రాజకీయ వ్యవస్థను రూపకల్పన చేసిన వ్యక్తుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటివ్యక్తి. అలాంటి నాయకుడిని జాతీయస్థాయిలో ఒక సమర్థవంతమైన, విలువలతో కూడిన రాజకీయ వ్యవస్థను ఏర్పాటుచేయడానికి దేశం యావత్ ఆహ్వానిస్తున్నది. కేసీఆర్ జాతిగౌరవాన్ని పెంపొందించడమే కాకుండా, విదేశీ వ్యవహారాలు, వ్యవసాయరంగం, సాగు, తాగునీరు, నిరుద్యోగ నిర్మూలన, ఆధునిక పారిశ్రామిక విధానాన్ని సమర్థవంతంగా నిర్వహించగలడని ప్రజలు విశ్వసిస్తున్నారు. వారి ఆశయాల కు తగ్గట్టుగా కేసీఆర్ నాయకత్వం పనిచేస్తుందన్న నమ్మకం దేశ ప్రజలందరిలో ఉన్నది.
దేశంలోని రైతులందరినీ సంఘటితపరచి దేశా న్ని అభివృద్ధి పథంలోకి తీసుకురావడానికి తెలంగాణ పథకాలే స్ఫూర్తిగా నిలువనున్నాయి. దేశంలో రైతు పురోభివృద్ధికి దోహదపడే ఆధునికమైన వ్యవసాయ విధానాన్ని స్వామినాథన్ వంటి వ్యవసాయ శాస్త్రవేత్తలతో చర్చించి అమలుచేయగల సత్తా కేసీఆర్కు మాత్రమే ఉన్నది. ఇది నూటికి నూరుపాళ్లు కేసీఆర్తోనే సాధ్యమవుతుందని యావత్ దేశం ఆయన రాక కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నది.
(వ్యాసకర్త: పీఆర్వో, కేయూ)
-డాక్టర్ రక్కిరెడ్డి ఆదిరెడ్డి
98495 77610