నిరంకుశ, అవినీతి, అసమర్ధ పాలన, మతతత్వ రాజకీయాలు చేసేవారికి కన్నడ ఓటరు తీర్పు చెంపపెట్టుగా చెప్పవచ్చు. ఆ రాష్ట్రంలో 80శాతం జనాభా హిందువులే. అయినా, హిందువుల పార్టీగా చెప్పుకునే బీజేపీకి ఎన్నికల్లో భంగపాటు తప్పలేదు. ఇకపై మతతత్వ రాజకీయాలు ఎంతమాత్రం చెల్లనేరవని ఆ రాష్ట్ర ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. ప్రపంచీకరణ పుణ్యమా అని మనిషి జీవన విధానంలో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నేటి ఆధునిక యువత కట్టుబాట్లను వీడుతున్నారు. కులాంతర, మతాంతర వివాహాలు చేసుకోవడానికి వెనుకాడడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా మత రాజకీయాలు చేసుకుంటూ కాలం వెల్లదీస్తామంటే బీజేపీని నేటితరం ఉపేక్షించే పరిస్థితి లేదు.
బీజేపీ సర్కారు ఏకపక్ష నిర్ణయాల వల్ల అనేక రాష్ర్టాలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇన్నేండ్ల బీజేపీ పాలనలో ప్రజలకు మేలు చేసే ఏ ఒక్క మంచి పథకం లేదంటే అతిశయోక్తి కాదు. సమాఖ్య స్ఫూర్తిని విస్మరించి పాలన సాగిస్తున్న మోదీ తీరుతో కేంద్ర, రాష్ర్టాల మధ్య సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంతగా దెబ్బతిన్నాయి.
సింగపూర్, మలేషియా, జపాన్, దక్షిణకొరియా వంటి చిన్నచిన్న దేశాలు సైతం అభివృద్ధితో ప్రపంచంపై తమదైన ముద్ర వేస్తున్నా యి. ప్రపంచంలోనే అత్యధిక జనాభా, కొదువ లేని మానవ వనరులకు నిలయమైన భారత్ మాత్రం ఆశించిన స్థాయిలో రాణించడం లేదన్నది జగమెరిగిన సత్యం. ప్రపంచమంతా అభివృద్ధి, ఆవిష్కరణలు అంటూ కొత్త తోవన పరుగులు తీస్తుంటే బీజేపీకి మా త్రం ఒక విజన్ అంటూ లేకుండా పోయింది. ఎంతసేపు మతాలు, విభజన రాజకీయాలు, దేవుళ్ల పేరు చెప్పి చిల్లర రాజకీయాలు చేస్తున్నది. టెక్నాలజీ పెరిగి మానవ జీవితంలో.. సమాజంలో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రపంచమే కుగ్రామంగా మారింది. అనేక రంగాల్లో నూతన ఆవిష్కరణలు చోటుచేసుకుంటున్నాయి. నేటియుగంలో చదువు, సాంకేతికత కీలక పాత్ర పోషిస్తున్నాయి.
ఈ అంశాల్లో మనిషి కావచ్చు, దేశం కావచ్చు వెనుకబడితే ఇక ప్రపంచంతో నిలబడడం కష్టమే. సాంప్రదాయ విధానాలు పట్టుకుని వేళాడడం తప్పు కాదు. కానీ, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోకపోతే మా త్రం వెనకబాటు తప్పదు. ఆధునిక ఆయుధ సంపత్తి సమకూర్చుకోకపోతే దేశ భద్రత ప్రశ్నార్ధకంగా మారుతుంది. చుట్టూ శత్రు దేశాలున్న భారత్కు ఆధునిక సైనిక పాటవం, ఆయుధాలు చాలా అవసరం. టెక్నాలజీ అప్గ్రేడ్, అభివృద్ధి, ప్రపంచ స్థాయి మౌలిక వసతుల కల్పన, విద్య, వైద్యం బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా గొప్పలు చెప్పుకునే బీజేపీకి ఇవేమీ పట్టడం లేదు. ఎంతసేపు మత రాజకీయాలు, హిందూ-ముస్లింల మ ధ్య చిచ్చుపెట్టడం తప్ప దేశాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనే లేదు. సైనికుల త్యాగాల ను సైతం సెంట్మెంట్కు ఉపయోగించుకుని రాజకీయ లబ్ధిపొందడానికి కూడా ఆ పార్టీ వెనుకాడడం లేదు.
ఏముంది గర్వకారణం..
ఒంటెద్దు పోకడలు, నిరంకుశ నిర్ణయాలు మంచికంటే కీడే ఎక్కువ చేస్తాయి. ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న అనేక నిర్ణయాలు వీటిని రుజువు చేశాయి. మనది ప్రజాస్వామిక దేశం. కేంద్రానికి ఎంత బాధ్యత, హక్కులు ఉన్నాయో.. రాష్ర్టాలకు అంతే ఉంటాయి. కానీ, ఇవేవి పట్టించుకోకుండా మోదీ తీసుకున్న, తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలతో మనదేశం ఎంతోనష్టపోతున్నది.
నల్లధనం అరికడతామంటూ ఆగమేఘాల మీద పెద్దనోట్లు రద్దుచేశారు. రాత్రికిరాత్రే తీసుకున్న ఈ నిర్ణయంతో దేశ ప్రజలందరూ ఎంతో ఇబ్బందులకు గురయ్యారు. చిన్న, మధ్య తరహా, కుటీర పరిశ్రమలు దెబ్బతిన్నాయి. ఉపాధి అవకాశాలకు భారీగా గండిపడింది. పెద్దనోట్ల రద్దు
ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదు.
దేశంలో ఎవరిని అడిగినా ఇదే విషయం చెబుతారు. కరోనా టైంలో కూడా రాష్ర్టాలను కనీసం సంప్రదించకుండా లాక్డౌన్ విధించా రు. దీంతో వలస కార్మికులు పడిన బాధలు వర్ణణాతీతం. వేల కిలోమీటర్లు ఎండల్లో నడి చి ఇంటికి చేరుకోవాల్సి వచ్చింది. ఈ ఘటన నాగరిక ప్రపంచంలో అమానవీయ ఘటనగా చెప్పుకోవచ్చు. ఇది కేంద్ర పాలకుల కర్కశత్వా న్ని తేటతెల్లం చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే బీజేపీ సర్కారు ఏకపక్ష నిర్ణయాల వల్ల అనేక రాష్ర్టాలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇన్నేండ్ల బీజేపీ పాలనలో ప్రజలకు మే లు చేసే ఏ ఒక్క మంచి పథకం లేదంటే అతిశయోక్తి కాదు. సమాఖ్య స్ఫూర్తిని విస్మరించి పాలన సాగిస్తున్న మోదీ తీరు తో కేంద్ర, రాష్ర్టాల మధ్య సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంతగా దెబ్బతిన్నాయి. కేంద్రం సెస్ పేరిట అడ్డగోలు గా దొడ్డిదారిన దోచుకుంటూ తన ఖజానా నిం పుకుంటూ రాష్ట్రాలను విస్మరిస్తున్నది. జీఎస్టీ ఆదాయం పెరిగిందని జబ్బులు చరుచుకుంటున్న కేంద్రం, అన్ని వస్తువులను జీఎస్టీలోకి తెచ్చి ప్రజలపై ఎన్నడూ లేనంత భారం మోపిం ది. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి పెట్టుబడులు రెట్టింపు చేసి వ్యవసాయాన్ని భా రంగా మార్చింది. ఏటా రెండుకోట్ల ఉద్యోగాలు ఇస్తామంటూ నమ్మబలికి ఆ హామీని విస్మరించి ఈ దేశ యువతను మో సం చేసింది. తొమ్మిదేండ్ల బీజేపీ పాలనలో ఒక్క భారీ సాగునీటి ప్రాజెక్టు కట్టలేదు. ఎంతసేపు కార్పొరేట్ల ప్రయోజనాలే లక్ష్యంగా పాకులాడడం తప్ప పేదల గురించి ఆలోచించిన పాపాన పోలేదు.
ఉపాధిహామి పథకాన్ని నిర్విర్యం చేస్తూ ప్రతి యేటా కేంద్ర బడ్జెట్లో భారీగా నిధుల కోత పెడుతున్నది. ఫలితంగా గ్రామాల్లో ఉపాధిహామి కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, ఎరువులు, విత్తనాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే ధరలు పెరగడం తప్ప ప్రజలకు ఉపశమనం కలిగించే ఒక్క మంచి నిర్ణయం తొ మ్మిదేండ్ల మోదీ పాలనలో తీసుకున్నది లేదు. ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ పరం చేయ డం, జాతి వనరులను కార్పొరేట్లకు దోచిపెట్టడం దర్జాగా సాగుతున్నది. సీబీఐ, ఈడీ, ఐటీ వంటి రాజ్యాంగ సంస్థలను తమ జేబు సంస్థలుగా మార్చుకుని ప్రతిపక్షాలు, ప్రశ్నించిన వారిపై దాడులు చేయిస్తూ ఢిల్లీ పెద్దలు పైశాసికానందం పొందుతున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా రూపాయి విలువ దిగజారింది. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తున్నదని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
(వ్యాసకర్త :ఉమ్మడి మెదక్ జిల్లా బ్యూరో ఇంచార్జీ)
కత్తుల శ్రీనివాస్రెడ్డి
91827 77027