భారతదేశంలో పుట్టిన బౌద్ధమతం ఆ తర్వాత చైనా, జపాన్, థాయిలాండ్, శ్రీలంక, భూటాన్, సింగపూర్ మొదలైన దేశాల్లో విస్తరించింది. సమాజంలో మానవులందరూ సమానమేనని, కులాలకు తావులేకుండా అందరూ ఒక్కటేననే భావన కలిగించడంతో బౌద్ధం అందరినీ ఆకట్టుకున్నది.
బౌద్ధమతం మానవులందరినీ సమానత్వ దృక్కోణం నుంచి చూసింది. కుల, మ తాలకు అతీతంగా సమానత్వం, సౌభ్రాతృత్వంతో జీవించాలని ప్రజలను నిర్దేశించింది. బౌద్ధమతం ఒక మేధో తాత్విక మతం. దీనిలో ఆత్మ, దేవుడు, మరణానంతర జీవితం, మూఢనమ్మకాలు, సంప్రదాయం వంటి విషయాలపై ప్రత్యేక చర్చ లేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సామాజిక తత్వశాస్త్రం గౌతమ బుద్ధుని నుంచి ప్రేరణ పొందినదే.
నాడు బౌద్ధమతం రెండు శాఖలు ప్రబలంగా ఉండేవి. అవి మహాయాన, హీనయానం. హీనయాన శాఖ దేవుని ఉనికిని తిరస్కరించింది. బుద్ధుడిని మార్గాన్ని చూపే వ్యక్తిగా పరిగణించింది. కానీ మహాయానులు బుద్ధుడిని దేవుడిగా కాకుండా శక్తి రూపంగా భావించి పూజించారు.
క్రమంగా విదేశీయుల దండయాత్రలు, మతపరమైన మార్పుల కారణంగా బౌద్ధమతం భారతదేశంలో ఉనికి కోల్పోతూ వచ్చింది. కొంతమంది భారతీయులు బౌద్ధమతాన్ని పూర్తిగా విదేశీ మతం గా భావించడం మొదలుపెట్టారు. కానీ 20వ శతాబ్దంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ హిందూ మతాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారు.1935లో యోలా మైదాన్లో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ ‘నేను హిందూ మతంలో పుట్టాను. అది నా ని యంత్రణలో లేదు. కానీ నేను హిందూ మతంలో చావను. అ ది పూర్తిగా నా నియంత్రణలోనే ఉంది’ అన్నారు. ఆ రోజు నుం చి అంబేద్కర్ దాదాపు 21ఏండ్లపాటు అన్ని మతాలను అధ్యయనం చేసిన తరువాత బుద్ధుని సూత్రాలే ఆచర ణాత్మకమైనవని భావించారు.ప్రపంచంలో సమాజాన్ని మనిషిగా చూడగలిగే ఏకైక మతం బౌద్ధం అని తెలుసుకున్నానన్నారు.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిన్నప్పటి నుంచి కబీర్ అనుచరుడు. అందువల్ల బుద్ధుడిని అర్థం చేసుకోవడం అతనికి కష్టం అనిపించలేదు. అంబేద్కర్ తన కమ్యూనిటీకి చెందిన లక్షలాది మంది ప్రజలు, ఇతరులతో కలిసి మహారాష్ట్ర లోని నాగపూర్లో 1956 అక్టోబర్14న విజయదశమి రోజున బౌద్ధమతంలోకి మారారు. నాటి నుంచి ఆ రోజును దేశమంతటా ‘ధమ్మ చక్ర పరివర్తన దినం’గా జరుపుకుంటున్నారు.
ఎందుకంటే ఈ రోజునే గౌతమ బుద్ధుడు బౌద్ధ సూత్రాలను ఆవిష్కరించారు. అలాగే తన ఐదుగురు శిష్యులకు మొదటి మతపరమైన దీక్షను ఇచ్చారు. ఇదే రోజున అశోక చక్రవర్తి యుద్ధరంగంలోనే బౌద్ధమతం స్వీకరించాడు. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజునే బౌద్ధ మ తం స్వీకరించాలని నిర్ణయించు కున్నారు. విజయదశమి పర్వ ది నం రోజున ఆయన బౌద్ధం స్వీక రించారు. నాటి నుంచి ఆ రోజు ను ‘ధమ్మచక్ర పరివర్తన దినం’గా పిలుస్తున్నారు. బుద్ధుని మార్గం ద్వారానే ప్రపంచంలో శాంతి, సామరస్యాలు నెలకొంటాయని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విశ్వసించారు. అందుకే ఆయన బౌద్ధమతాన్ని స్వీకరించడానికి ఆసక్తి చూపారు.
-మధునూరే రాహుల్
63053 97692