తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడానికి ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ నినాదం గొప్ప స్ఫూర్తిగా పనిచేసింది. నేడు అలాంటి నినాదమే ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ దేశమార్పుకు నాంది పలుకనున్నది. అరవైయేండ్ల కల సాకారం వెనుక అనేక త్యాగాలు, పోరాటాలు దాగి ఉన్నాయి. ఒక లక్ష్యం నెరవేరాలని అకుంఠిత దీక్షతో నిర్మాణాత్మక ఉద్యమాన్ని నిర్మించి తెలంగాణ రాష్ట్ర సాధనకు కృషిచేశారు కేసీఆర్. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడమేగాక..ఇప్పుడు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సుపరిపాలన అందిస్తున్నారు.
తెలంగాణలో వృత్తి జీవనాధారంగా ప్ర భుత్వ పథకాలు ఉండాలని భావించి న కేసీఆర్..సబ్బండ వర్గాలను అన్ని రంగాల్లో ఆదుకోవడం కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపాల నే ఆలోచన, వారిని ఆర్థికంగా బలోపేతం చే యాలనే చిత్తశుద్ధితో దళితబంధు పథకానికి రూపకల్పన చేసి, దళిత కుటుంబాలకు పది లక్షలు ఇవ్వడం ఈ ప్రపంచంలో ఎక్కడా జరిగి ఉండదు. నాటి సమైక్య పాలనలో ధ్వంసమైన తెలంగాణ కుల వృత్తులను ఒక్కొక్కటిగా తీర్చిదిద్దుతూ, గాడిన పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవిరామ కృషి ఫలితంగా, గ్రామీణ ఆర్థి క వ్యవస్థ పరిపుష్టమవుతున్నది. తెలంగాణ సబ్బండ కులాల జీవనంలో గుణాత్మక మార్పు కు తెలంగాణ సర్కార్ ప్రాణం పోస్తున్నది. గొల్ల కురుమలు, యాదవుల కోసం గొర్రెల పంపిణీ, బెస్తలు, ముదిరాజుల కోసం చేపల పెంపకం కార్యక్రమాలు ఇప్పటికే అద్భుత ఫలితాలు ఇస్తున్నాయి. వ్యవసాయం తర్వాత పెద్ద ఎత్త్తున ఆధారపడిన కుల వృత్తి చేనేత రంగం. దీనికి రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరలు తదితర పథకాలతో ఎంతగానో చేయూత నిస్తున్నది.
తెలంగాణ ఉద్యమమే ఒక ఆత్మగౌరవ ఉద్య మం. ఆత్మగౌరవ ఉద్యమానికి నాయకత్వం వ హించిన సీఎం కేసీఆర్.. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలోఅందరూ తలెత్తుకుని బతికేలా ఎస్సీ, ఎస్టీ, ఎంబీసీ, బీసీ, సంచార కులాల ఆత్మగౌరవ భవనాలకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ మహానగరంలో దళితులకు బా బూ జగ్జీవన్ రాం భవన్, గిరిజనులకు బం జారాభవన్, ఆదివాసులకు కుమ్రంభీం భవన్లకు భూములు కేటాయించి నిర్మించారు. వీరితోపాటు 36 బీసీ కులాలకు భవన నిర్మాణాలకు స్థలాలు, నిధులు కేటాయించారు. మహాత్మా జ్యోతిరావ్ పూలే, సావిత్రీబాయి పూలే ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని.. అందరికీ విద్యతోనే సమాజంలో సమానహక్కులు సాధ్యమవుతాయని భావించిన సీఎం కేసీఆర్ విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కోసం వందల సంఖ్యలో గురుకులాలను ఏర్పాటు చేశారు.
హాస్టళ్లలో చదువుకునే విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే దృఢసంకల్పంతో సన్నబియ్యం భోజనా న్ని అందిస్తున్నారు. విద్యార్థులకు స్కాలర్షిప్లతోపాటు విదేశాల్లో చదువుకోవాలనుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఓవర్సీ స్ స్కాలర్షిప్ ద్వారా 20 లక్షలు సాయం అందిస్తున్నారు.
రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్, మిషన్ కాకతీయ, మి షన్ భగీరథ వంటి పథకాలు దేశ చరిత్రలోనే నిలిచిపోతాయి. కేసీఆర్ కిట్, కల్యాణ లక్ష్మీ, షా దీ ముబారక్, ఆసరా పింఛన్లు, ఆరోగ్యలక్ష్మీ, హరితహారం, డబుల్ బెడ్రూం ఇండ్లు వంటి పథకాలు ప్రజల ప్రశంసలందుకున్నాయి. తెలంగాణ పథకాలను చూసి దేశం గర్విస్తున్నది. అనేక రాష్ర్టాలు మన పథకాలను అధ్యయనం చేసి అమలు చేస్తున్నాయి. అందుకే దేశమంతా తెలంగాణ వైపు చూస్తున్నది. సీఎం కేసీఆర్ అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో దేశంవైపు నడవడమనేది ఒక సాహసోపేత నిర్ణ యం. దేశంలో మార్పునకు మనమంతా భాగస్వాములమై.. మరో చరిత్రకు సాక్షుల మై, నూతన భారతదేశ నిర్మాణాన్ని స్వాగతిద్దాం!
బండారు జితేందర్
93912 94127