తెలంగాణ రాష్ట్రం ఆరు దశాబ్దాల స్వప్నం. అసలు సాధ్యమైతదా…మన కండ్లతోని చూస్తమా? అనే సందేహాల రంగుల కల. రాష్ట్రం కోసం కొట్లాడని తరం లేదు. తనువెల్లా తెలంగాణవాదం నింపుకుని ఉద్యమంలో పోరాడి అసువులు బాసిన అమరులెందరో. కానీ.. తెలంగాణ రాష్ట్రం సాకారం కాలేదు. పోరాట స్ఫూర్తి ఆగిపోలేదు. ‘మీ బాట సాగుతాము అమరులారా’ అంటూ ప్రతీ తరం తమవంతుగా కొట్లాడింది. కానీ… సమైక్యవాదుల కుట్రలు, ప్రతిదశలో కాంగ్రెస్ మోసాలతో ఉద్యమం నయవంచనకు గురైంది.
ఆశలు కోల్పోయిన తెలంగాణ జనాలకు మళ్లీ ఆశలు చిగురింపచేసిన తెలంగాణ యో ధుడు సీఎం కేసీఆర్. అడుగడుగునా ఆటంకాలు ఎదురైనా ఎదురునిలిచి పోరాడిన ఘన త కేసీఆర్ది. యావత్తు రాష్ర్టాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చి…ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించి చూపారు. తెలంగాణ రాష్ట్రం కేవ లం భౌగోళిక తెలంగాణ కాదు. బతుకులు బాగుపడే తెలంగాణ. ఉద్యమం జరుగుతున్నప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఇదే విషయం పదేపదే పలు వేదికలపై చెప్పారు. తెలంగాణ పునర్నిర్మాణం జరగాల్సిన ఆవశ్యకతను వివరించారు. నీళ్లు, నిధు లు, నియామకాలు నినాదంతో సాధించిన రాష్ర్టాన్ని సగర్వంగా నిలబెట్టేలా ప్రణాళికలు రచించారు కేసీఆర్.
తెలంగాణ రాష్ట్రం…మిగిలిన రాష్ర్టాలకు పూర్తిగా భిన్నం. అరవై ఏండ్లపాటు అణచివేతకు గురైన తెలంగాణకు తిరిగి పునరుజ్జీవం కలిగించడం పాలకుల కర్తవ్యం. తెలంగాణ పునర్నిర్మాణం అంటే… అరవై ఏండ్ల సంక్షోభం నుంచి బయటపడ్డ తెలంగాణ ఏ దిశలో సాగాలో ఆలోచించే నాయకత్వం అవసరం. అలాంటి నాయకత్వం కేసీఆర్ సొంతం.
సాధించిన తెలంగాణను బాగు చేసే ఉద్దేశంతో విద్య, వైద్య, వ్యవసాయ, సాంస్కృతిక రంగాల్లోనూ ఏం చేయాలో కూడా ప్రణాళికలు, పథకాల్ని తయారు చేశారు కేసీఆర్. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఏర్పడిన తొలి ప్రభుత్వంలోనే కేసీఆర్ భావి తెలంగాణకు బాటలు వేశారు. ప్రత్యేక రాష్ట్రంలో ఏర్పడిన తొలి ప్రభు త్వం చాలా కీలకం. అందుకే కేసీఆర్ నిపుణుల సలహాలు తీసుకుంటూ ముందుకు అడుగులు వేశా రు. పరిపాలన సౌలభ్యం కోసం 10 జిల్లాలను 33 జిల్లాల తెలంగాణగా మార్చి పాలనను ప్ర జల చెంతకు చేర్చారు.
సర్కారు బడుల రూపురేఖ లు మారిపోయాయి. పిల్లలు పౌష్టికాహారంతో కూడిన టిఫిన్, మధ్యాహ్నం సన్నబియ్యం అన్నం తింటున్నారు. పేదలకు నాణ్యమైన విద్య చేరువయింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకుల పాఠశాలలు అందుబాటులోకి వచ్చా యి. కేసీఆర్ పాలనలో పల్లె నుంచి పట్నం వరకు దవాఖానాలు కోలుకున్నాయి. పల్లె దవాఖానాలు, బస్తీ దవాఖానాలు, జిల్లాకొక మెడికల్ కాలేజీ ఏర్పాటయింది. పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, నర్సరీలు, వైకుంఠధామాల్ని ప్రభుత్వం నిర్మించింది.
సమైక్య పాలనలో నీళ్లు లేక బీడువారిన నేలలు, నేడు పచ్చని మాగాణంగా మారాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కర్షకుల కన్నీళ్లు తుడిచింది. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. రైతులకు పెట్టుబడి సాయం కింద రైతుబంధు, ఆపతికాలంలో ఆదుకునేందుకు రైతుబీమా వంటి పథకాలు పల్లెల్లో అన్నదాతల్లో ఆనందం నింపాయి. సమాజంలో ఆపన్నులైన వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ఫించన్లు అందిస్తూ..వాళ్ల పాలిట కేసీఆర్ దేవుడిగా, పెద్ద కొడుకుగా నిలి చా రు. పేదింటి బిడ్డ పెండ్లికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నారు.
తెలంగాణ గోస తెలిసిన కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ బాగుపడుతుందని నమ్మిన ప్రజలు రెండు సార్లు అధికారం కట్టబెట్టారు. మన బతుకులు, భావితరాల భవిష్యత్ కేసీఆర్ చేతుల్లోనే సురక్షితంగా ఉంటుందని జనం నమ్ముతున్నారు. కేసీఆర్ మన బ్రతుకులు బాగు చేసే బ్రహ్మాస్త్రం. ప్రజా ఆశీర్వాదంతో హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమయ్యారు.
ఇనుగుర్తి సత్యనారాయణ
97046 17343