తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ఎంతో ముందుగా ప్రకటించడమే కాకుండా, స్వయంగా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. మరోవైపు ప్రతిపక్షాలు కూడా తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసే పనిలో ఉన్నాయి. కేసీఆర్ ప్రచారానికి, ప్రతిపక్షాల ఆర్భాటానికి తేడా స్పష్టంగా కనిపిస్తున్నది.
కేసీఆర్ పరిపాలనా సరళిలో, ప్రచారం తీరులో ఎంతో స్పష్టత ఉన్నది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రచారంలో డొల్లతనం కనిపిస్తున్నది. ఇటీవలి ఎన్నికల హామీ లు ఇందుకు ఒక ఉదాహరణ. తెలంగాణ సమాజం పట్ల, అవసరాల పట్ల ప్రతిపక్షాలకు అవగాహన లేకపోవడమే ప్రతిపక్షాల భావదారిద్య్రానికి కారణం.
బీజేపీ, కాంగ్రెస్లకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటి? ప్రజ ల అవసరాలు ఏమిటి? ఏ పథకం ఎందుకు ఇవ్వాలనే ఆలోచనే రాదు. వాస్తవానికి కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆక లి దప్పులను ఇప్పటికే తీర్చివేశారు. తెలంగాణ ఆ దుస్థితిని ఎప్పుడో అధిగమించింది. ఇప్పుడు కేసీఆర్ ఆలోచనలు తెలంగాణను ఇంతకుమించి ఏ విధంగా అభివృద్ధి చేయాలనే స్థాయిలో ఉన్నాయి. కేసీఆర్ ఆలోచనలు ఎన్నికల కోస మే పరిమితమయ్యేవి కాదు. అదే కేసీఆర్కు ఇతర పార్టీల నాయకులకు తేడా. అందుకే కాంగ్రెస్, బీజేపీలకు చెందిన రాష్ట్ర నాయకులు, దేశ నాయకులు ఎవరూ కేసీఆర్కు సరితూగలేరు. దీనికి కారణం ఎన్నికల రాజకీయం చుట్టూ కేసీఆర్ తిరుగుతూ ఉండరు. విస్తృతంగా ప్రజా సంక్షేమం కోసం ఆలోచిస్తుంటారు.
కేసీఆర్ ఒక విజనరీ. తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి చెందడమనేది ఆయన స్వప్నం. ఆయన అహర్నిశలు తెలంగాణ సమాజం కోసం తపిస్తూ ఉంటారు. తెలంగాణ సమగ్ర దర్శనంలో భాగంగా ఆయన మనసులో అనేక వ్యూహాలు రూపుదిద్దుకుంటూ ఉంటాయి. ఆ అభివృద్ధి వ్యూహాల్లో భాగంగానే దార్శనికుడైన కేసీఆర్ అనేక పథకాలకు రూపకల్పన చేస్తుంటారు. మనకు బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టో కనిపిస్తుంది. కేసీఆర్ చెప్పే కొన్ని హామీలు కనిపిస్తాయి. కానీ వాటివెనుక కేసీఆర్ సమగ్రాభివృద్ధి వ్యూహా లు ఉన్నాయనే గొప్ప విషయం చాలామందికి తెలియని ది. కేసీఆర్ అభివృద్ధి వ్యూహంలో ఎన్నికల హామీలు చాలా స్వల్పమైనవి.
ఎన్నికల హామీలకే కేసీఆర్ హామీలు, పరిపాలన, ఆలోచన పరిమితం కాదు. ఎన్నికల మ్యానిఫెస్టోలో లేని అనేక పథకాలను కేసీఆర్ తన పరిపాలనా క్రమంలో అమలు చేయడా న్ని మనం గమనించవచ్చు. ఉదాహరణకు రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి- షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, బతుకమ్మ చీరలు, దళితబంధు, బీసీ బంధు మొదలైనవేవీ ఎన్నికల హామీలు కాదు. ఇటీవల ఎరుకల సాధికారత పథకంగా పందుల పెంపకం ప్రకటించారు. ఆయా సామాజికవర్గాల అవసరాన్ని గుర్తించి ప్రకటించే పథకాలు ఇవి. వీటికి ఎన్నికలకు సంబంధం లేదు. హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యం పెట్టడం కూడా వారు కడుపు నిండా తినాలనే ఉద్ధేశంతోనే. ఇది కేసీఆర్ మానవీయ ఆలోచనలకు ప్రతిబింబం. ఇటువంటివి ఎన్నికల హామీలు కానవసరం లేదు. కరోనా కాలంలో వడ్లు కొనాలనే ఆలోచన కేసీఆర్ వంటి నాయకులకే వస్తుం ది. ఇవన్నీ సమాజ హితం కోరుకునే ఏ పాలకుడైనా చేయవలసిన కనీస ధర్మాలు.
కేసీఆర్ విడుదల చేసిన మ్యానిఫెస్టోలో ‘ఇంటింటికీ బీమా- కేసీఆర్ ధీమా’ కొత్తది. దీనివల్ల బీపీఎల్ కుటుంబాలకు ఐదు లక్షల బీమా వర్తిస్తుంది. క్రమపద్ధతిలో ఆసరా పింఛన్ నెలకు ఐదు వేలకు పెంచాలని నిర్ణయించారు. రైతుబంధు 16 వేలకు పెంచుతున్నారు. ఆరోగ్య బీమా పరిమితిని 5 లక్షల నుంచి 15 లక్షలకు పెంచుతున్నారు. పేద మహిళల కోసం సౌభాగ్య లక్ష్మి పథకం ద్వారా నెలకు మూడు వేలు అందించాలని భావిస్తున్నారు. గ్యాస్ సిలిండర్ను పేదలకు రూ.400కే ఇస్తామని ప్రకటించారు. అగ్రవర్ణపేదల పిల్లల కోసం నియోజకవర్గానికి ఒక గురుకులం ఏర్పాటుచేస్తామని చెప్పారు. మైనారిటీ గురుకులాలను డిగ్రీ కళాశాలలుగా ఉన్నతీకరిస్తామని కూడా కేసీఆర్ ప్రకటించారు. ఇవన్నీ ఎన్నికల గెలుపు కోసం హడావుడి గా రూపొందించిన పథకాలు కావు. ఏటా సమాజ ఎదుగుదలను, అవసరాలను సమీక్షిస్తూ, ఆర్థిక పరిస్థితులను బేరీజు వేసుకుంటూ కేసీఆర్ ఆయా పథకాలను ప్రవేశ పెడుతూ ఉంటారు.
మనం కేసీఆర్ దార్శనికతను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ దార్శనిక నాయకుడు ఒక పద్ధతి ప్రకారం సమాజాన్ని ఏ విధంగా అభివృద్ధి పథంలో నడిపించుకుపోతున్నారనేది అర్థం చేసుకోవాలి. ఆడబిడ్డ నల్లా ముందు బిందె పట్టుకొని నిలబడే కష్టం పోవాలన్న ఆలోచనతో ఇంటింటికీ నీళ్లు వస్తున్నాయి. ఇదేవిధంగా చెరువులు నిండాయి. గోదావరి జలాలు బీడులను పచ్చని పొలాలుగా మార్చాయి. అణగారిన వారి పిల్లలు గురుకులాలలో కార్పొరేట్ స్థాయి విద్య పొందుతున్నారు. ఇవన్నీ మన ముందు ఏకరువు పెట్టలేదు. కానీ అమలుచేసి చూపిస్తున్నారు.
ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. అటవీ విస్తీర్ణం పెరిగింది. మానవాళి సంక్షేమానికి భరోసా లభిస్తున్నది. ఇదంతా ఒకప్పుడు కేసీఆర్ కలగన్నారు. నా తెలంగాణ ఇంత గొప్పగా ఉండాలని ఆకాంక్షించారు. ఆ ఆకాంక్షను, ఆ స్వప్నాన్ని సాకారం చేసుకున్న తృప్తి ఆయనకు లభించింది. కేసీఆర్ భవిష్యత్తు వ్యూహాలు చాలా సమగ్రంగా ఉంటాయి. అందులోంచి కొత్త కొత్త పథకా లు, విధానాలు వస్తుంటాయి. రాష్ట్రంలో అనేక వైద్య కళాశాలలు ప్రారంభించారు. భవిష్యత్తులో ఏటా వేలాది మం ది వైద్యులు అందుబాటులోకి వస్తారు. ఇదేవిధంగా గురుకులాలు అనేకమంది ప్రతిభాశాలులను తయారుచేస్తున్నాయి. భవిష్యత్తులో భావి భారతాన్ని పాలించేది, నడిపించేది ఈ బాలలే.
రాజకీయ నాయకుడు రాబోయే ఎన్నికల కోసం ఆలోచిస్తాడు. పాలనాదక్షుడు రాబోయేతరాల గురించి ఆలోచిస్తాడు. కేసీఆర్ సాధారణ నాయకుడు కాదు, దార్శనికుడు, పరిపాలనాదక్షుడు. ఆయన రాబోయే తరాల కోసం అన్ని రంగాలను తీర్చిదిద్దుతున్నారు. ఆయన అధికారంలో ఉం టే అద్భుతాలను సృష్టిస్తూనే ఉంటారు. కేసీఆర్ మహోన్న త నాయకుడు. ప్రజల దృష్టిలో కేసీఆర్ మాత్రమే నాయకుడు, ముఖ్యమంత్రి పీఠానికి విలువ తేగల నిజమైన పాలనాదక్షుడు.
(వ్యాసకర్త: డైరెక్టర్, టీ కేసీఆర్ సెంటర్)
-గోసుల శ్రీనివాస్ యాదవ్
98498 16817