కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిదంబరం వ్యాఖ్యలపై బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి స్పందన గురివింద సామెతను గుర్తుకుతెస్తున్నదని అంటున్నారు. ఇంతకాలానికైనా తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ క్షమాపణ చెప్పింది. మరి మీ (బీజేపీ) సంగతేమిటని సామాజిక మాధ్యమాల్లో కిషన్రెడ్డిని నెటిజన్లు నిలదీస్తున్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని కాంగ్రెస్ ఇవ్వలేదు, 12 వందల మంది బలిదానాలతో ఏర్పడిందని కిషన్రెడ్డి గుర్తుచేసిన సంగతి తెలిసిందే. ఇంత వరకు బాగానే ఉంది, కానీ మరి పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ఉద్యమాన్ని అవహేళన చేసేలా ‘తల్లిని చంపి బిడ్డను బతికించారు’ అని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యల సంగతేమిటని నెటిజన్లు కిషన్రెడ్డిని ఉతికిపారేస్తున్నారు. చిదంబరం చేసిన వ్యాఖ్యలకు స్పందించిన మీరు, మరి మోదీ వ్యాఖ్యలకు ఎందుకు స్పందించకుండా నోరు మూసుకున్నారని సూటిగా ప్రశ్నించారు. మనం చేస్తే ఒప్పు, పక్కోడు చేస్తే తప్పా అని కిషన్రెడ్డికి చుక్కలు చూపిస్తున్నారు.