ప్రభుత్వ బ్యాంకులను నిండా ముంచి, సుమారు 20 లక్షల కోట్లు ఎగ్గొట్టిన గుజరాత్ వ్యాపారులు అంబానీ, అదానీ, నీరవ్ మోదీ, లలిత్ మోదీలకు దేశ సంపదను దోచిపెట్టింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.
గుజరాత్ రాష్ట్రం నుంచే భారతదేశ పాలన జరుగుతున్నదనేది సుస్పష్టం. కరోనా సమయంలో ప్రపంచం అంతా అతలాకుతలమైంది. మన దేశంలో మాత్రమే గుజరాత్ కుబేరులు మరింత కుబేరులుగా వర్ధిల్లారు. దీనికి ప్రధాన కారణం మోదీ ప్రభుత్వం అదానీకి దేశ ఆర్థిక వనరులు మొత్తం గంప గుత్తగా చౌకగా అమ్మివేయడమే. బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీ, రైల్వేస్, ఎయిర్వేస్, కోల్ లాంటి అతిపెద్ద సంస్థలను గుజరాత్ వ్యాపారులకు అమ్మడం. నీరవ్ మోదీ, లలిత్ మోదీ, అంబానీ, అదానీ లాంటి వ్యక్తులు కేంద్ర బ్యాంకులను మోసం చేస్తే కనీసం వాళ్లను బ్లాక్లిస్టులో కూడా పెట్టలేదు. పోగా వారికి లక్షల కోట్లు రాయితీలిచ్చి రుణాలు మాఫీ చేయడం వారిపై మోదీకి ఉన్న ప్రేమను తెలియజేస్తున్నది.
ఆదివాసీలకు రాష్ట్రపతి పదవి ఇచ్చామని చెప్తున్న బీజేపీ అసలు ఎందుకు ఈ పదవి ఇచ్చిందో చెప్పలేదు. దేశాన్ని మొత్తం దోచుకున్నాం కానీ ఆదివాసీ ప్రాంతాలు ఇంకా మిగిలి ఉన్నాయి. ఒక ఆదివాసీ మహిళను రాష్ట్రపతిగా మార్చితే ఆదివాసీ ప్రాంతాలను కూడా మామూలు ప్రాంతాలుగా మార్చుకోవడానికి తద్వారా అక్కడ కూడా మైనింగ్ తరహా దోపిడీ చేసుకోవడానికి అవకాశం కేవలం రాష్ట్రపతి ఉత్తర్వులు ఉంటేనే సాధ్యమవుతుంది. అందుకే, ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా నియమించారు. మతాన్ని మాత్రమే వాడుకొని ప్రజల్లో అంతరాలు పెంచి ఒకరిపైన ఒకరు దాడి చేసుకునే లాగా ప్రజల మస్తిష్కాల్లో విషాన్ని నింపడంలో బీజేపీ, తన అనుచర శాఖలు విజయం సాధించాయి. దేశంలో గనుక మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే జరిగేది అభివృద్ధి కాదు, మారణ హోమం మాత్రమేనని మాల మహానాడు అభిప్రాయం. అందుకే బీజేపీని అధికారంలోకి రాకుండా ప్రజలను చైతన్యపరుస్తాం.
(వ్యాసకర్త: మాల మహానాడు జాతీయ అధ్యక్షులు)
పబ్బతి శ్రీకృష్ణ
95334 11328