భారత రాజ్యాంగం 8వ షెడ్యూల్లోని 17వ అధికరణం (343 నుంచి 351 వరకు) భారతీయ భాషల జాబితాకు గుర్తింపు నిచ్చింది. గుర్తింపు పొందిన 22 భాషలను ఆధునిక అభ్యాసానికి, సమర్థవంతమైన కమ్యూనికేషన్ మాధ్యమంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ప్రకటించింది.
రాజ్యంగంలోని అధికరణం 343లో హిందీ ని అధికార భాషగా గుర్తించింది. అధికర ణం 348(1)(ఎ) ప్రకారం భాషను నిర్ధారించే చట్టం పార్లమెంటులో రూపొందించే వరకు సుప్రీంకోర్టులో జరిగే అన్ని ప్రక్రియలు ఇంగ్లీషులో జరుగుతాయని పేర్కొన్నది. అధికరణం 348 (2) ప్రకారం రాష్ట్రపతి సమ్మతితో హిందీని గాని ఇతర భాషలను గానీ అధికారిక అవసరాల కోసం సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో ఉపయోగించుకునే వెసులుబాటును కల్పించింది. అయితే కిందిస్థాయి కోర్టులు మాత్రం దీన్ని పట్టించుకోవటం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఉన్నత న్యాయస్థానాల్లో ఉపయోగించే భాషను నిర్ధారించే అధికారం 24వ అధికరణం ద్వారా పార్లమెంటుకు దాఖలు పరిచింది. సివిల్ కోర్టుల్లో తెలుగు భాషను ఉపయోగించుకోవడానికి అలాగే అన్ని జిల్లాల క్రిమినల్ కోర్టుల్లో తెలుగుభాషలో న్యాయ పరిపాలన జరుగాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్ట్టిస్ డీ. వై చంద్రచూడ్ కోర్టు తీర్పులను ప్రాంతీయ భాషలలో అందుబాటులో ఉంచే ప్రక్రియను 2023 జనవరి 25న ప్రారంభించారు. గణతంత్ర దినోత్సవం నుంచి ఈ-ఎస్సీఆర్ ప్రాజెక్ట్లో భాగంగా సుప్రీం కోర్టు వెబ్సైట్లో 34 వేల తీర్పులను అందుబాటులో ఉంచారు. అవసరమైన తీర్పుల గురించి సెర్చ్ఇంజన్లో టైప్ చేస్తే ఇంగ్లిష్ జడ్జిమెంట్, అలాగే దానికి సంబంధించిన ప్రాంతీయ భాషల జాబితా కూడా వచ్చే ఏర్పాట్లు చేశారు. భాషా అవరోధాన్ని అధిగమించేందుకు కృత్రి మ మేధస్సు ఆధారంగా ప్రాంతీయ భాషల్లో సుప్రీంకోర్టు తీర్పులను అందుబాటులోకి తెచ్చే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. తెలంగాణ న్యాయమూర్తులు జస్టిస్ పి.నవీన్ రావు, జస్టిస్ నగేష్ భీమపాక 2023 జూన్ 27న తొలిసారి తెలుగులో తీర్పును వెలువరించారు.
పరిశ్రమల్లో ఎదురయ్యే న్యాయ సంబంధ కేసులను విచారించేందుకు ప్రత్యేకంగా లేబర్ కోర్టులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్య సింగరేణి కంపెనీలో వివిధ చట్టాల అమలు కోసం సైతం లేబర్ కోర్టు పనిచేస్తున్నది.
ఎనిమిది గంటల విధులు నిర్వహించే కార్మికులు అంతకంటే ఎక్కు వ గంటలు పనిచేస్తే ఓవర్టైం వేతనాలు చెల్లించాలనే నిబంధన ఉన్న ది. అయితే గతంలో ఆ నిబంధనల ను పట్టించుకోకుండా యాజమా న్య ం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఈ విషయమై కార్మికులు సెంట్రల్ గవర్నమెంట్ ఇండస్ట్ట్రియల్ ట్రిబ్యునల్ కమ్ లేబర్ కోర్టు హైదరాబాద్కు నివేదించారు. లేబర్కోర్టు స్పంది ంచి కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించింది. వ్యాసకర్త నైన నేను ‘సమాచార హక్కు చట్టం 2005’ మార్గదర్శకంగా కార్మికులు అదనంగా చేసిన పని గంటల విధుల నిర్వహణ సమాచారాన్ని తీసుకుని ఎల్ఈవో(లేబర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్)సెంట్రల్కు ఫిర్యాదు చేశాను. అలాగే లేబర్కోర్ట్లో అఫిడవిట్ సమర్పించాను. పలు దఫాల కేసు విచారణ వాయిదాల అనంతరం యాజమాన్యం కౌంటర్ అఫిడవిట్ను 2019 జూన్ 18న దాఖలు చేసింది. అం దులో 2010, 2011 లలో కార్మికులు అదనంగా చేసిన పని గంటలకు 2012 డిసెంబర్లో చెల్లించామని తెలిపింది. మరల నేను పిటిషనర్ ఎవిడెన్స్ పారిశ్రామిక వివాదాల చట్టం 1947,సెక్షన్ 29 ప్రకారంగా అవార్డ్ను గాని, పరిష్కార ఒప్పందాన్ని గాని ఉల్లఘించినట్లయితే రోజుకు రూ.200 జరిమానా చెల్లించాలని కోరాను.
వేతన చెల్లింపు చట్టం 1936 సెక్షన్ 20(60) ప్రకారంగా నిర్ణయించిన తేదీకి వేతనాలు చెల్లించని ఎడల రోజుకు రూ.100 చొప్పున జరిమానా చెల్లించాలని విన్నవించాను. దానికి జతగా ఓవర్ టైం డ్యూటీల వేతనాలను చెల్లించాలని కార్మికులు సంబంధిత అధికారులకు పెట్టుకున్న దరఖాస్తులను,‘అసిస్టెంట్ లేబర్ కమిషనర్ (సెంట్రల్ )’ దగ్గర చర్చలు విఫలమైన నివేదికను, ‘ సమాచార హక్కు చట్టం 2005’ మార్గదర్శకంగా తీసుకున్న కార్మికుల ఓవర్ టైం డ్యూటీల ధృవీకరణ ప్రతులు, ఓవర్ టైం డ్యూటీల వేతనాల చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని ‘లేబర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్'(సెంట్రల్) యాజమాన్యానికి రాసిన లెటర్ ను సాక్ష్యంగా సమర్పించాను. నేను ఇచ్చిన ఎవిడెన్స్ పై క్రాస్ ఎగ్జామ్ చేయవలసిన యాజమాన్యం తరుపు ప్రతివాది సమయానికి రాలేదు. అప్పుడు జడ్జి కేసును సెప్టెంబర్ 9 నాటికి వాయిదా వేశారు. ఈలోపు ప్రతివాది వచ్చిన పిదప లేబర్ కోర్టు నిర్వహణ సిబ్బంది నేను సమర్పించిన ఎవిడెన్స్ జత ప్రతుల్లో తెలుగుభాషలో ఉన్న ప్రతులపై అభ్యంతరం తెలిపారు.
లేబర్కోర్టులో తెలుగు నడువదని, ఇది సెంట్రల్ గవర్నమెంట్ లేబర్ కోర్టు అని, జడ్జికి తెలుగు రాదని, తెలుగు భాష ప్రతులను ఇంగ్లీషు భాషలోకి తర్జుమా చేసి సమర్పించాలని సూచించారు.అప్పుడు నేను కన్సిలేషన్ ప్రొసీడింగ్స్ నుంచి లేబర్ కోర్టు వరకు తెలుగు భాషలోనే రాశానని విన్నవించాను. 2013లో కేసు దాఖలు అయినప్పుడు తెలుగు తెలిసిన జడ్జి ఉండేవాడని, ఇప్పటి జడ్జికి తెలుగు రాదని ఎదురు సమాధానం చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పులను ప్రాం తీయ భాషల్లో తర్జుమా చేసినట్టుగా, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు గౌరవ జడ్జిలు తెలుగులో తీర్పులు ఇచ్చినట్టుగా ’సెంట్రల్ గవర్నమెంట్ ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ కమ్ లేబర్ కోర్టు ’లో కూడా పిటిషనర్ తెలుగుభాషలో అఫిడవిట్ ను, అలాగే ఎవిడెన్స్ అఫిడవిట్ను నివేదించుకోవడానికి, సత్వర న్యాయం పొందడానికి చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుకుంటున్నారు.
-మేరుగు రాజయ్య
94414 40791