సహజంగా కారు లేదా బస్సులో ప్రయాణించాలంటే కొంత భయం ఉంటుంది..కానీ రైలు ప్రయాణం అంటే సేఫ్ అనే ఫీలింగ్ చాలా మందికి ఉంటుంది. టెక్నాలజీ రాకముందు గతంలో అనేక రైలు ప్రమాదాలు జరిగాయి. కానీ ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో రైలు ప్రమా దాలు అరుదు అన్న నమ్మకం ఏర్పడింది. కానీ ఈ ఆధునిక కాలంలో కనీవినీ ఎరుగని రీతిలో ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొని పెనువిషాదం చోటు చేసుకోవడం విచారకరం. అసలు ప్రమాదం ఎలా జరిగింది. దీనికి బాధ్యులెవరు? ఇలాంటి పొరపాట్లు జరిగినపుడు ఎవరు బాధ్యత వహించాలి?
ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో సుమారు 300 మంది మరణించారు. ఇది పూర్తిగా రైల్వేశాఖ నిర్లక్ష్యానికి నిదర్శనం. దీనికి బాధ్యత వహి స్తూ రైల్వేశాఖ మంత్రితో పాటు ప్రధాని మోదీ రాజీనామా చేయాలి. ప్రారంభించిన వందేభారత్ రైళ్లనే పదేపదే ప్రారంభిస్తూ ప్రచారం చేసుకుంటున్న మోదీ రైల్వే వ్యవస్థను మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. రైల్వే శాఖలో ఖాళీగా ఉన్న ఎనిమిది లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడంలో విఫలమయ్యారు. సిబ్బంది తక్కువగా ఉండడంతో రైల్వే లైన్ల తనిఖీ కుంటుపడింది. ఎప్పటికప్పుడు రైల్వే ట్రాక్లను పరిశీలించకపోవడం కూడా ప్రమాదానికి కారణం కావచ్చు. ఏదేమైనా జరగాల్సిన ప్రాణం నష్టం జరిగిపోయింది.
ఈ రైలు ప్రమాదం మీద కొంతమంది చేసే వ్యాఖ్యలు విపరీతంగానూ, అర్థరహితంగానూ ఉన్నాయి. లూప్లైన్లోకి వెళ్లేటప్పుడు వేగం ఎందుకు తగ్గించలేదంటూ ప్రశ్నిస్తున్నారు. రైళ్ల గురించి ఏ మాత్రం అవగాహన ఉన్న ఎవరికైనా ఈ విషయం అర్థమవుతుంది…నిజానికి ఆ రైలు వెళ్లాల్సింది లూప్ లైన్ లోకి కాదు. మెయిన్ ట్రాక్ మీద. అక్కడ జరిగిన పొరపాటే అది.
మెయిన్ట్రాక్కు సిగ్నల్ ఇచ్చి, చివరి నిముషంలో ఎవరో పొరపాటున లేదా ‘కావాలనో’ లూప్ లైన్కు ట్రాక్ మళ్లించారు. అప్పుడిక వేగం తగ్గే అవకాశం లేదు. రైలు లూప్ లైన్లోకి ఎందుకు వెళుతుందో లోకో పైలట్ అర్థం చేసుకొనే లోపే అది గూడ్స్ రైలును ఢీకొట్టింది. అయితే ఇంకో రైలు వెంటనే వచ్చిందా? ఐదా రు నిముషాల తరువాత వచ్చిం దా అనేది స్పష్టంగా తెలియరాలేదు. ఒక వేళ వెంటనే వచ్చి ఉంటే మాత్రం ఏమీ చేయలేం. కానీ ఐదారు నిముషాల తర్వాత వచ్చి ఉంటే… అక్కడ మరో తప్పిదం లేదా అలసత్వమున్నట్టే. ఎందుకంటే, ప్రమాదం జరిగి, ట్రాక్ల మీద బోగీలు అడ్డదిడ్డంగా ఉన్నప్పుడు.. ఆ పట్టాల పైకి రైళ్లను అనుమతించకుండా రెడ్ సిగ్నళ్లు వేయాలి. ఇది జరగలేదంటే- మానవ తప్పిదమున్నట్టే. ఇందులో స్టేషన్ మాస్టర్ లేదా సిబ్బంది తప్పిదం ఉండే అవకాశమున్నది. ప్రమాదాలు జరిగినపుడు రైలు ఇంజిన్తో పా టు, ఆ వెనుక ఉండే జనరల్ బోగీలకు ఎక్కువ ప్రమా దం ఉంటుంది. వాటిలో పేదలే ప్రయాణిస్తా రు. వాళ్లే ఎక్కువ మంది మరణించారు. వారికి కేంద్ర ప్రభు త్వం రూ. 15 లక్షలు, క్షతగాత్రులకు ఐదు లక్షలు నష్టపరిహారం ఇవ్వాలి.
ప్రమాదాలను పూర్తిగా తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం గతంలో ‘కవచ్’ను తీసుకొస్తున్నట్టు ప్రక టించింది. దీనివల్ల ఇక ముందు ప్రమాదాలు జరగ వని వెళ్లడించింది. అయినా ప్రమాదం జరగడానికి కారణం ఏంటీ? బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నట్టు దీనివెనుక కుట్రకోణం ఏమన్న దాగి ఉందా?అనే విషయంలోనూ సమగ్ర విచారణ జరి పించాలి. అలాగే అధికారుల తప్పిదం అని తేలితే వెంటనే చర్యలు చేపట్టాలి.
అలాగే బాధితుల మృతదేహాలను ట్రాలీల్లో విసిరేస్తున్న దృశ్యాలు అమానవీయంగా ఉన్నాయి. జంతువుల కళేబరాల్లాగా విసిరేస్తున్న తీరు మానవ సమా జం తల దించుకునేలా ఉన్నది. పోయిన ప్రాణాలను ఎలాగు తె చ్చివ్వలేరు. కనీసం ఆ శవాలకైనా కాస్తా గౌరవం ఇస్తే బాగుంటుం ది. ఒడిశా కోరమాండల్ రైలు ప్ర మాదం ముమ్మాటికీ రైల్వేమంత్రి వైఫల్యం. కనుక ఆయన తక్షణమే తన మ్రంతి పదవికి రాజీనామా చేసి తీరాలి. మున్ముందు ఇలాం టి ప్రమాదాలు జరుగకుండా ప్ర భుత్వం రక్షణ చర్యలు చేపట్టాలి. (వ్యాసకర్త : ప్రజా సంబంధాల అధికారి)
-ఆలేటి రమేశ్
9948798982