ఎవరి లక్ ఎలా ఉంటుందో ఊహించలేం. ఇప్పటి పరిస్థితిని చూసి తక్కువ అంచనా వేయకూడదు. ఈరోజు ఏమీ లేని వాళ్లు.. రేపు ఉన్నత స్థానాల్లో ఉండొచ్చు. కోట్ల డబ్బు సంపాదించవచ్చు. ఓవర్ నైట్ ఏదైనా జరగొచ్చు. అలా జరిగి కోట్లు సంపాదించిన వాళ్లు కోకొల్లలు మన దేశంలో. అలాంటి వ్యక్తే ఈయన. ఒకప్పుడు ఒక టిఫిన్ బాక్స్ను చేతుల్లో పట్టుకొని ముంబై వచ్చారు. నేడు ఎవ్వరూ ఊహించలేనంత సామ్రాజ్యాన్ని నెలకొల్పారు. నేడు ఆయన కంపెనీ వాల్యూ ఎంతో తెలుసా.. 3.6 బిలియన్ డాలర్లు.. అంటే మన కరెన్సీలో 26 వేల కోట్ల రూపాయలకు పైనే. ఇంతకీ ఆయన ఎవరు.. ఆయన ఏ కంపెనీ నెలకొల్పారో తెలుసుకుందాం రండి.
ఆయన పేరు అనీల్ అగర్వాల్. ప్రముఖ పారిశ్రామికవేత్త. వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, ఫౌండర్. అగర్వాల్.. తన టీనేజ్ వయసులో ఉన్నప్పుడు ఒక టిఫిన్ బాక్స్ను చేత పట్టుకొని తన సొంతూరు బీహార్ను వదిలేసి ముంబైకి వచ్చేశారు. ఇప్పుడు పెద్ద మైనింగ్ సామ్రాజ్యానే నిర్మించారు.
స్క్రాప్ మెటల్ డీలర్షిప్గా ముంబైలో పనిచేస్తూ ఇప్పుడు భారత్లోనే అతి పెద్ద మైనింగ్ కంపెనీలలో ఒకటిగా వేదాంత నిలిచింది. అయితే.. ఇదంతా ఆయనకు ఏదో రెడ్ కార్పెట్ పరిచినట్టుగా కాలేదు. ఇప్పుడు ఈ స్థానానికి చేరుకోవడానికి కొన్ని దశాబ్దాలు పట్టింది. ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. చివరకు తను అనుకున్నది సాధించారు.
Millions of people come to Mumbai to try their luck. I was one of them. I remember the day I left Bihar with only a tiffin box, bedding, and dreams in my eyes. I arrived at Victoria Terminus station, and for the first time… pic.twitter.com/e4cN2U89vu
— Anil Agarwal (@AnilAgarwal_Ved) February 15, 2022
తను ముంబై వచ్చినప్పుడు పరిస్థితులు ఎలా ఉండేవి.. బీహార్ను వదిలి ఒక టిఫిన్ బాక్స్తో ముంబైలో అడుగుపెట్టి విక్టోరియా టర్మనస్ రైల్వే స్టేషన్కు చేరుకొని తొలిసారి టాక్సీలు, బస్సులను చూసి ఆశ్చర్యపోయానంటూ ఇటీవల తన పాత జ్ఞాపకాలను అగర్వాల్ గుర్తు చేసుకున్నారు.