హైదరాబాద్: మునుగోడు గెలుపుతో 2023లో టీఆర్ఎస్ హాట్రిక్ విజయం ముందే ఖారరైందని ఎన్ఆర్ఐ కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల అన్నారు. ఉపన్నికలో అఖండ విజయం సాధించిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. మునుగోడును గెలిచేందుకు బీజేపీ మొక్కని మొక్కు, దిక్కు లేదని, చెప్పని అబద్ధం లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్కు ఎదురులేదని.. కేసీఆర్కు తిరుగులేదని మునుగోడు ప్రజలు మరోసారి చాటారని వెల్లడించారు.
టీఆర్ఎస్పై కుట్రకు దిగిన కోమటిరెడ్డి సోదరుల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారయిందన్నారు. ఏడాదిలో (2023 ) రానున్న సాధారణ ఎన్నికల ఫలితం కూడా ఈ విజయంతో ముందే ఖరారైందన్నారు. టీఆర్ఎస్ను కేసీఆర్ ఒక్కడిగా మొదలుపెట్టినా.. నేడు 65 లక్షలకుపైగా కార్యకర్తల బలం ఉన్న పార్టీగా ఎదిగిందని చెప్పారు. రోజురోజుకూ పార్టీ బలం పెరుగుతూనే ఉన్నదని, ఇప్పుడు జాతీయ పార్టీగా రూపాంతరం చెందిందన్నారు.