Venkaiah Naidu | సింగపూర్ పాఠశాలలో తెలుగుని మాతృభాషా మాధ్యమంగా ప్రవేశపెట్టాలని సింగపూర్ ప్రభుత్వానికి భారత ప్రభుత్వంతో విజ్ఞప్తి చేయించాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్ప వరపు వెంకయ్యనాయుడును కోరారు. ఈ మేరకు శ్రీ సాంస్కృతిక కళా సారధి, కాకతీయ సాంస్కృతిక పరివారం, తెలుగుదేశం ఫోరం ఆఫ్ సింగపూర్ ప్రతినిధులు వెంకయ్యనాయుడుకు విజ్ఞప్తి చేశారు.
శ్రీ సాంస్కృతిక కళా సారధి వారి విజయోత్సవం కార్యక్రమంలో పాల్గొనేందుకు సింగపూర్ వచ్చిన వెంకయ్య నాయుడుకి అభ్యర్ధన పత్రం అందించారు. సింగపూర్లో దాదాపు రెండు శాతం తెలుగు ప్రజలు నివసిస్తున్నారు. మాతృభాషల్లో ఒకటిగా తెలుగును గుర్తించడం వల్ల కొన్ని వేల తెలుగు విద్యార్థులకు ఉపయోగపడుతుందని తెలిపారు.
వెంకయ్య నాయుడుకు అభ్యర్థర పత్రం సమర్పించిన వారిలో శ్రీ సాంస్కృతిక కళా సారధి, కాకతీయ సాంస్కృతిక పరివారం, తెలుగుదేశం ఫోరం ఆఫ్ సింగపూర్ సంస్థల ప్రతినిధులు కవుటూరి రత్న కుమార్, జొన్నాదుల సుధాకర్, పాతూరి రాంబాబు, శ్రీధర్ భరద్వాజ్, దామచర్ల అశోక్ కుమార్ ఉన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ భావి తరాలకు తెలుగును అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. తన వైపు నుంచి అందుకు అవసరమైన సాయం అందిస్తానన్నారు.