కువైట్ : సీఎం కేసీఆర్ సారధ్యంలో తెలంగణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తుందని ఎన్నారై టీఆర్ఎస్ కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల అన్నారు. కువైట్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్స వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అభిలాష మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో పోరాడి సాధించుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ఆ నినాదాలను నేడు నిజం చేశారన్నారు.
పచ్చని పంటలు, అనేక ప్రాజెక్టులతో తెలంగాణ కళకళలాడుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్ణాలు సంతోషంగా ఉన్నాయని ఆమె తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి కువైట్ అధ్యక్షుడు వినయ్ , యునైటెడ్ తెలుగు ఫోరం అధ్యక్షుడు వెంకట్ కోడూరి, కొండల్ రెడ్డి, సురేష్, అయ్యప్ప, సరోజ రెడ్డి, రవి సుదగాని, మహ్మద్ దస్తగిరి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.