దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్ వేదికగా తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌతాఫ్రికా(TASA) ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భారత కాన్సులేట్ కార్యాలయం నుండి కాన్సులర్ ఆఫీసర్ సుధీర్ ఖురానా ముఖ్య అతిథిగా హాజరై తెలంగాణ చారిత్రక వారసత్వాన్ని, సమైక్యతను కొనియాడారు.
అధ్యక్షులు తాళ్లూరి శ్రీనివాస్ పదేళ్లుగా తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌతాఫ్రికాకు సహకరిస్తున్న సభ్యులకు, కార్యవర్గానికి ధన్యవాదాలు తెలిపారు. రాపోలు సీతారామరాజు ఆధ్వర్యంలో కార్యక్రమం ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. పిల్లలు, పెద్దల నృత్య కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో TASA సహాయ సహకారాలు అందించిన వారిని, మిగతా తెలుగు సంఘాల పెద్దలను ఘనంగా సత్కరించుకుంది. ఉపాధ్యక్షుడు బండారు మురళి వందన సమర్పణతో కార్యక్రమం పూర్తయ్యింది.