హైదరాబాద్ : నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా తీపి కబురు చెప్పారు. దీంతో పోరాడి తెచ్చుకున్న తెలంగాణ కల నేటితో సాకారం అయిందని టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అసెంబ్లీ వేదికగా భారీ ఎత్తున 91,142 ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేయడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు.
మొన్న నీళ్లు వచ్చినయ్. నిన్న నిధులు వచ్చినయ్. నేడు నియామకాలు వచ్చినయ్. దీంతో సంపూర్ణ తెలంగాణ కలలు సాకారం అయిందన్నారు. బంగారు తెలంగాణ సాధనలో అన్నింటిని పరిపూర్ణం చేస్తున్న కేసీఆర్కు తెలంగాణ ప్రజలు అంతా రుణపడి వుంటారని అన్నారు. ఎన్నారైల అందరి తరపున సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.