హైదరాబాద్: సింగపూర్లోని తెలంగాణ కల్చరల్ సొసైటీ (టీసీఎస్ఎస్) ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. గత 11 ఏండ్ల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని సొసైటీ అధ్యక్షుడు నీలం మహేందర్ అన్నారు. హెల్త్ అండ్ సైన్స్ అథారిటీ సమక్షంలో ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరం విజయవంతం అయ్యిందని, సుమారు 50 మంది స్వచ్ఛందంగా ముందుకువచ్చి రక్తదానం చేశారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయంవంతం చేసిన వారందరకి సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి గొప్ప సేవా కార్యక్రమాలు ఎంతో సంతృప్తినిస్తాయని చెప్పారు. కొవిడ్ లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా సామాజిక దూరం పాటిస్తూ ఈ శిబిరం నిర్వహించడం అభినందనీయమని హెల్త్ అండ్ సైన్స్ అథారిటీ ఆఫ్ సింగపూర్ అధికారులు అన్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న తెలంగాణ కల్చరల్ సొసైటీనికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి నంగునూరి వెంకట రమణ, గోనె నరేందర్, శశిధర్ రెడ్డి, శివ ప్రసాద్ ఆవుల సమన్వయకర్తలుగా వ్యవహరించారు. ఇందులో ప్రధాన కార్యదర్శి, బసిక ప్రశాంత్ రెడ్డి, సంస్థాగత కార్యదర్శి గడప రమేష్, సభ్యులు.. దుర్గ ప్రసాద్ మంగలి, పెరుకు శివరామ్ ప్రసాద్, ముదాం అశోక్ తదితరులు పాల్గొన్నారు.