హైదరాబాద్ : అమెరికా తెలుగు సంఘం (ఆటా) ‘ఆటా నాదం’ పాటల పోటీలను ఆన్లైన్లో జూమ్ ద్వారా నిర్వహించింది. ప్రతి రెండు సంవత్సరాలకు ఆటా మహాసభలు జరిపే ముందు ప్రథమంగా రెండు తెలుగు రాష్ట్రాలలో సంస్థ సేవా కార్యక్రమాలు చేపడుతుతున్నది.
ఆటా వేడుకల కార్యక్రమంలో భాగంగా ప్రతిభా వంతులైన యువ గాయనీ గాయకులకు ఆటాలో ప్రత్యేకమైన వేదికను కల్పంచాలనే సదుద్దేశంతో సంస్థ ‘ఆటా నాదం’ పాటల పోటీల కార్యక్రమానికి అంకురార్పణ చేసింది. దాదాపుగా 200 మంది గాయనీ గాయకులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఈ పోటీలో పాల్గొన్నారు.
ఉత్తరాధ్యక్షులు, ఆటా సేవ డేస్ & ఆటా వేడుకల చైర్మన్ మధు బొమ్మినేని, పాలకమండలి సభ్యులు, సంయుక్త కార్యదర్శి, ఆటానాదం కోఆర్డినేటర్ రామకృష్ణా రెడ్డి ఆల, పాలక మండలి సభ్యులు సేవ డేస్ & ఆటా వేడుకల కో చైర్మన్ అనిల్ బొద్దిరెడ్డి, పాలక మండలి సభ్యులు సేవ డేస్ & ఆటా వేడుకల కో చైర్మన్ శరత్ వేముల, పాలకమండలి సభ్యులు ఆటా నాదం కోఆర్డినేటర్ శారద సింగిరెడ్డి మాతృదేశంలో తెలుగు రాష్ట్రాలలో ప్రతిభ ఉన్న గాయనిగాయకుల కోసం మొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఆటా సంస్థ ‘ఆటా నాదం’ పాటల పోటీలను అక్టోబర్ 23, 2021 న ప్రిలిమినరీ రౌండ్ తో ప్రారంభించి ఫైనల్స్ నవంబర్13, 2021 న ముగించింది. పదకొండు యువ గాయనీ గాయకులు ఫైనల్ రౌండ్లో పాల్గొనగా ప్రథమ స్థానంలో ప్రణతి కే, ద్వితీయ స్థానంలో మేఘన నాయుడు దాసరి, తృతీయ స్థానంలో వెంకట సాయి లక్ష్మి హర్షిత పాసాల, అభినవ్ అవసరాల గెలుపొందారు.
ఈ వేడుకకు సంగీత దర్శకుడు, ప్లేబాక్ సింగర్ నిహాల్ కొందూరి, ప్లేబాక్ సింగర్, సినీ మ్యుజీషియన్ యూనియన్ ప్రెసిడెంట్ విజయ లక్ష్మి, సంగీత దర్శకుడు,ప్లేబ్యాక్ సింగర్ సాయి శ్రీకాంత్ వెళ్లల, ప్లేబాక్ సింగర్ నూతన మోహన్ న్యాయ నిర్ణేతలుగా, రవళి పరిటాల వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ , సంగీత దర్శకుడు, ఎల్.ఎం.ఏ సంస్థాపకుడు, ఆటా సంస్థ ఇండియా సాంస్కృతిక సలహాదారు రామాచారి కొమండూరి కార్యక్రమములో పాల్గొని గాయనీ గాయకులకు అభినందనలు తెలియజేసారు.
కాగా, మధు బొమ్మినేని డిసెంబర్ 5,2021 నుంచి డిసెంబర్ 25 2021 వరకు రెండు తెలుగు రాష్ట్రాలలో, అధ్యక్షులు భువనేశ్ బూజల, పాలక మండలి సభ్యులు, ఆటా కార్యవర్గ బృందంతో కలిసి విద్య, వైద్య , కమ్యూనిటీ సేవలు, స్త్రీ సంక్షేమ, బిజినెస్ సెమినార్స్, ఎడ్యుకేషనల్ సెమినార్స్ లాంటి వివిధ కార్యక్రమాలు వివిధ నగరాలలో, గ్రామాలలో నిర్వహించ బోతున్నారు.
ఈ కార్యక్రమాలతో పాటు సాహిత్య, సంగీత, నృత్య కార్యక్రమాలు మాతృదేశం కళాకారులతో రెండు తెలుగు రాష్ట్రాలలో నిర్వహిచబోతున్నారు. విజేతలకు ‘ఆటా వేడుకలు గ్రాండ్ ఫినాలే’ రవీంద్రభారతి హైదరాబాద్లో డిసెంబర్ 26, 2021 లో సాయంత్రం 7 గంటలకు జరిగే సాంస్కృతిక కార్యక్రములో పాడడానికి గొప్పఅవకాశం ఆటా సంస్థ కల్పిస్తున్నది. దీనిని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Anti-farmer laws | రైతు వ్యతిరేక చట్టాలు రద్దు..అంబరాన్నంటిన సంబురాలు
అసెంబ్లీ ఎన్నికల తర్వాత మళ్లీ తెరపైకి నల్లచట్టాలు : అఖిలేష్ యాదవ్
అన్ని ఫార్మాట్ల క్రికెట్కు గుడ్బై చెప్పిన ఏబీ డివిలియర్స్
ఇది రైతులు సాధించిన చారిత్రక విజయం : మంత్రి సత్యవతి