లండన్ : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎమ్మెల్సీ(MLC Kavitha) కవితకు బెయిల్(Bail order) మంజూరు కావడంతో లండన్లో(London) ఎన్నారైలు(NRI) సంబురాలు జరుపుకున్నారు. ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో పటాకులు కాల్చి, స్వీట్లు పంచిపెట్టారు. ఏ ఆధారాలు చూపకుండా అక్రమంగా 166 రోజులు జైల్లో పెట్టారని వారు విమర్శించారు. రాజకీయ కుట్రతో పెట్టిన కేసులో చివరకు న్యాయమే గెలిచిందని, కవితకు బెయిల్ ఇవ్వడం పట్ల సుప్రీంకోర్టుకు ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం ధన్యవాదాలు తెలిపారు.
బెయిల్ వచ్చిన విధంగానే తుది తీర్పులో కూడా కడిగిన ముత్యంలా కవితబయటకు వస్తుందన్నాఉ. ఇవన్నీ రాజకీయ కుట్రలో భాగంగా పెట్టిన కేసులని, అయినా ఒక బాధ్యతగల దేశ పౌరురాలిగా న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంచి అన్ని రకాల విచారణలకు కవిత సహకరించారని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై బీఆర్ఎస్ నాయకులు రత్నాకర్ కడుదుల, రవి రేటినేని, సత్య చిలుముల, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.