హైదరాబాద్ : అభిస్తి సేవా పురస్కార్ అవార్డును టీఆర్ఎస్ ఎన్నారై సౌత్ ఆఫ్రికా శాఖ అధ్యక్షుడు నాగరాజు గుర్రాల అందుకున్నారు. హైదరాబాద్ నగరంలో 2020 సంవ్సత్సరంలో కరోనా, వరదలు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. కాగా ఈ వరద సహాయ కార్యక్రమాలకి అన్ని వైపుల నుంచి సహాయ సహకారాలు అందాయి.
అభిస్తి వెల్ఫేర్ సొసైటీ, బాగీస్ ఫుడ్ కోర్ట్ సహకారంతో వరద బాధితులకు ఆహార పొట్లాలు పంపిణీ చేసారు. ఈ పంపిణీకి టీఆర్ఎస్ ఎన్నారై సౌత్ ఆఫ్రికా శాఖ తమ వంతు సాయంగా ఎంతో మందికి ఆహార పొట్లాలు పంపిణీ చేసింది.
అందుకుగాను ఆదివారం అభిస్తి వెల్ఫేర్ సొసైటీ తమ 7 వ వార్షికోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ ఎన్నారై సౌత్ ఆఫ్రికా శాఖకి పురస్కారాన్ని ప్రకటించింది. ఈ పురస్కారాన్ని ఆ శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు అందుకున్నారు.
ఈ సందదర్భంగా తమకు అన్ని వేళలా అండగా నిలిచిన సౌత్ ఆఫ్రికాలోని ప్రజలకు నాగరాజు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సౌత్ ఆఫ్రికా శాఖ కార్యవర్గ సభ్యులు హరీష్ రంగా, సాయి వేముల పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
భవానీపూర్ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన మమతా బెనర్జీ
WhatsApp : భారత్లో 20 లక్షల వాట్సాప్ ఖాతాలు మూసివేత
ఆదాయం పెంచుతూ ప్రజలకు పంచే ప్రభుత్వం మాది : మంత్రి జగదీష్రెడ్డి