హంగేరి : సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని దేశంలోని వివిధ పార్టీలు, వర్గాల కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పైన ఎన్నారైల మద్దతు కోసం యూరప్ పర్యటనలో ఉన్న ఎన్నారై టీఆర్ఎస్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల హంగేరి దేశం
కాపిటల్ సిటీ బుడాపెస్ట్ లో అన్ని రాష్ట్రాల ఎన్నారైలతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మహేష్ బిగాల మాట్లాడుతూ.. నార్త్ ఇండియా, సౌత్ ఇండియా ఎన్నారైలు దేశంలోని రాజకీయ పరిస్థితులు గమనిస్తున్నారని అన్నారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కాకుండా ప్రత్యాన్మాయ పార్టీ అవసరమున్నట్లు ఎన్నారైలు భావిస్తున్నారని ఆయన తెలిపారు.
స్వరాష్ట్ర హక్కుల కోసం ఇంకొక గట్టి పార్టీ రావాలన్నారు. ముఖ్యంగా నార్త్ ఇండియన్స్ కేసీఆర్ పెట్టే కొత్త పార్టీ పైన విశ్వాసం ప్రకటించారని ఆయన పేర్కొన్నారు.
ఉక్రెయిన్ యుద్ధ సమయంలో తెలంగాణ విద్యార్థులకు సహాయం చేసినందుకు సీఎం కేసీఆర్కు ఎన్నారైలు ధన్యవాదాలు తెలిపారు .యుద్ధ సమయంలో వాలంటీర్లుగా పనిచేసిన ఎన్నారైలను అభినందించారు.
ఇందులో భాగంగా టీఆర్ఎస్ హంగేరి శాఖను ప్రారంభించారు. కార్యక్రమంలో ఢిల్లీ ,మహారాష్ట్ర ,వెస్ట్ బెంగాల్, కోల్కతా, జమ్మూ కశ్మీర్, కేరళ, చెన్నై, కర్ణాటక ఎన్నారైలతో పాటు గిరి అభిలాష్, కళ్యాణ్ వర్మ, భవాని ప్రసాద్ర్, సాగర్, పొట్లూరి అరవింద కుమార్,
సాహుల్ ఎలాజ జోసెఫ్, కోమల్ ఇంగ్లీ అభినవ్ దేశ్ పాండే, చందాన్ చక్రబర్తి సిసిలీ ఎం కురియన్, విశాల్ జగపత్ సాయి వర్మ, ప్రదీప్ పాల్గొన్నారు.