హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. జన్మదినం సందర్భంగా ప్రగతి భవన్లో సీఎంను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. అలాగే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్తో పాటు ఎమ్మెల్సీ కవితను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మహేశ్ బిగాలకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నారైల పక్షాన అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వివిధ కార్యక్రమాలను విజయవంతంగా చేస్తున్న మహేశ్ బిగాలని సీఎం కేసీఆర్ అభినందించారు. అలాగే వివిధ దేశాల్లో ఉన్న ఎన్నారైలు శుభాకాంక్షలు తెలిపారు.