హైదరాబాద్ : సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని టీఆర్ఎస్ ఎన్నారై శాఖ వ్యవస్థాపక అధ్యక్షుడు కూర్మాచలం అనిల్ అన్నారు. ఇప్పటికే ప్రభుత్వం లక్షకుపైగా ఉద్యోగాలను భర్తీ చేసి, మరో 91,142 పోస్టులను భర్తీ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించి మరోసారి నిరుద్యోగులపై ఉన్న బాధ్యతను మరోసారి తెలిపారన్నారు. ఉద్యోగ నియామకాలు ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేసిన ఆయన.. ఎన్నారైల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.
దేశ చరిత్రలో మాట తప్పని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ముమ్మాటికి కేసీఆర్ మాత్రమేనన్నారు. నూతన ఉద్యోగాల భర్తీతో ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారని, సీఎం కేసీఆర్పై ప్రజలకు అభిమానాన్ని ఊరూరా సంబురాలు చేస్తూ తెలుపుతున్నారన్నారు. రాష్ట్ర ఏర్పాటు నుంచి నేటి వరకు అన్ని వర్గాల ప్రజలకు సరైన సందర్భంలో న్యాయం చేస్తూ దేశానికే ఆదర్శ నాయకుడిగా నిలుస్తున్నారన్నారు. ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ చెప్పినట్లు నేడు మన నీళ్లు మనకు అందుతున్నాయని, మన నిధులు సంక్షేమ పథకాల ద్వారా ప్రజల వద్ద చేరుతున్నాయన్నారు.
ఇప్పటికే ప్రభుత్వం లక్ష ఉద్యోగాలు భర్తీ చేసి.. నేడు మరో 91వేల పోస్టులను భర్తీ చేయబోతున్నదని.. ఇది కేసీఆర్ కార్యదక్షతకు నిదర్శనమని అనిల్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగులు ప్రజలే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ఎన్నారైలంతా హర్షిస్తున్నారని, అందరు ఆయన వెంట ఉండి బలపరిస్తే త్వరలోనే మనం కలలుగన్న తెలంగాణ ఏర్పాటు జరుగుతుందన్నారు.