న్యూజిలాండ్ : దీక్షా దివస్ తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన రోజు. తెలంగాణ సాధనం కోసం కేసీఆర్ నవంబర్ 29న ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన రోజును దీక్షా దివస్గా జరుపుకుంటున్నాం. ఇందులో భాగంగా టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల ఆదేశాల మేరకు న్యూజిలాండ్లో దీక్షా దివస్ని ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా దీక్షా దీవస్ స్ఫూర్తిని, అమరుల త్యాగాలని, జ్ఞాపకాలను, పోరాటాలను న్యూజిలాండ్ శాఖ స్మరించుకుంది.
తెలంగాణ అమరవీరులు నివాళులు అర్పించారు. న్యూజిలాండ్ ప్రెసిడెంట్ జగన్ వడ్నాలా మాట్లాడుతూ.. నేడు మనం తెలంగాణ పౌరునిగా తల ఎత్తుకొని తిరుగుతున్నాం అంటే అది కేసీఆర్ దీక్షా ఫలితమే అన్నారు. ఈ సందర్భంగా న్యూజిలాండ్ శాఖ ద్వారా కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రంలో విజయ్ కోస్నా, కళ్యాణ్ కసుగంటి, అరుణ్ ప్రకాష్ రెడ్డి, రామారావు రాచకొండ, కిరణ్ పోకల, మౌనిక కొలిపాక, పానుగంటి శ్రీనివాస్, మోహన్ రెడ్డి, సింహ రావు ఏనుగంటి, వరుణ్ రావు పాల్గొన్నారు. న్యూజిలాండ్లో దీక్షా దివస్ ని నిర్వహించిన బృందానికి మహేష్ బిగాల ప్రత్యేకంగా అభినందిచారు.