Hyderabad Woman | మాస్టర్స్ చేసేందుకు అగ్రరాజ్యం అమెరికా వెళ్లిన తెలంగాణ యువతి అక్కడ రోడ్లపై ఆకలితో అలమటిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ఆ యువతి తల్లి తన కుమార్తెను భారత్ కు తీసుకురావాలని కోరుతూ.. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ (S Jaishankar)కు లేఖ రాసింది. ఇందుకు సంబంధించిన లేఖను బీఆర్ఎస్ (BRS) నాయకుడు ఖలీకర్ రెహమాన్ ( Khaleequr Rahaman) ట్విట్టర్ లో షేర్ చేశారు.
హైదరాబాద్ (Hyderabad ) మౌలాలికి చెందిన సయ్యదా లులు మిన్హాజ్ జైదీ (Syeda Lulu Minhaj Zaidi) అనే యువతి మాస్టర్స్ చేసేందుకు 2021 ఆగస్టులో అమెరికా వెళ్లింది. అక్కడికి వెళ్లిన తర్వాత తరచూ తన తల్లితో ఫోన్ లో మాట్లాడేది. అయితే, రెండు నెలల నుంచి యువతి నుంచి ఎలాంటి ఫోన్ రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆమె స్పందన కోసం రోజూ ఎదురు చూస్తూ ఉండేవారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్లిన కొందరు జైదీని గుర్తించి.. తన పరిస్థితి గురించి హైదరాబాద్ లోని తన తల్లికి సమాచారం అందించారు.
యువతి వస్తువులు ఎవరో దొంగలించారని, దీంతో చికాగో రోడ్ల (Chicago roads)పై జైదీ ఆకలితో అలమటిస్తున్నట్లు తెలియజేశారు. దీంతో తన కుమార్తె పరిస్థితి తెలుసుకున్న యువతి తల్లి సయ్యదా వహాజ్ ఫాతిమా (Syeda Wahaj Fatima).. తన కుమార్తెను తిరిగి భారత్ కు తీసుకురావాల్సిందిగా కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ ను కోరింది. ఈ మేరకు లేఖ రాసింది. ఈ లేఖను తన ట్విట్టర్ లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Request @DrSJaishankar to kindly look into it.@HelplinePBSK @IndiainChicago @IndianEmbassyUS @sushilrTOI @meaMADAD https://t.co/rwtevJ1fWr
— Khaleequr Rahman (@Khaleeqrahman) July 26, 2023
Also Read..
Samantha | బాలి జిమ్ క్లబ్ లో సామ్ అదిరిపోయే స్టంట్స్.. వీడియో షేర్ చేసిన నటి
Ms Dhoni | వింటేజ్ కార్ లో ధోనీ చక్కర్లు.. వీడియో వైరల్
Anand Mahindra | మ్యూజికల్ రోడ్డు.. ఆలోచన అద్భుతమంటూ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా