Telugu Language | నేడు తెలుగు భాష ఎదుర్కొంటున్న క్లిష్టమైన పరిస్థితులను విశ్లేషించి, సమాధానాలు వెతకాలి. లేకపోతే వేరు పురుగు చెట్టను బలహీనపరిచినట్టు, నేటి సమస్యలు, భాషను బలహీనపరిచి భావితరాలను భాషకు దూరం చేసే అవకాశం ఉందని వీధి అరుగు కార్యక్రమం పేర్కొంది. విదేశాల్లో ఉన్న పిల్లలకు తెలుగు నేర్పించడం ఎలా? అనే అంశంపై వీధి అరుగు – నార్వే వేదిక ఆధ్వర్యంలో ఆన్లైన్ వేదికగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ గీతా మాధవి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆమె ప్రసంగం ఎంతో ఆకట్టుకుంది. తెలుగు అక్షరాలు మహేశ్వరుని ఢమరుకం నుంచి ఎలా పుట్టాయో, పాణిని, అష్టాధ్యాయి నుంచి ఉదహరించి, ఉత్పత్తి స్థానము ఆధారంగా అక్షరాలను ఎలా వర్గీకరించాలో తెలిపారు. తెలుగు ఎలా రాయాలో చిట్కాలు చెప్పారు. తెలుగు ఎలా నేర్చుకోవాలో పాటల రూపంలో తెలిపారు. 15 దేశాల నుంచి తెలుగు వారు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో తరిగోపుల వెంకటపతి, విజయ భాస్కర్, విక్రమ్ సుఖవాసి, డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్, మల్లేశ్వర్ రావు, తొట్టెంపూడి గణేశ్, తర్రా అప్పలనాయుడు, కామేశ్వర శర్మ, రామకృష్ణ ఉయ్యూరు, లక్ష్మణ్, అన్నపూర్ణ మహీంద్రా, వెంకట్, కామేశ్వర్ శర్మ, బాలాజీ యాదవ్, రవితేజ గుబ్బ తదితరులు పాల్గొన్నారు.