ఆస్ట్రేలియా : దళిత బంధు పథకం కాదు.. ఒక ఉద్యమం అని టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి అన్నారు. 75 సంవత్సరాల స్వాతంత్య్ర భారత దేశ చరిత్ర లో దళిత జాతి అభ్యున్నతికి మాటలు, మూటలు కట్టుకున్న ప్రధాన మంత్రులు, ముఖ్యమంత్రులను ప్రజలు చూశారు. కాగా, హామీలను మొదటి సారి ఆచరణలో పెట్టిన సీఎం కేసీఆర్ను చూసి భారత జాతి గర్విస్తుందని నాగేందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
హుజురాబాద్లో ఈ రోజు సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం ప్రవేశపెట్టడంపై సంతోషం వ్యక్తం చేశారు. దళితులకు ఆర్థిక సంపదను సృష్టించి సమాజంలో వారికి హోదా గౌరవం కల్పించి వారి ఉన్నతి కు తోడ్పడుతున్న సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారన్నారు.