భాగవతం ఆణిముత్యాలు (ఐ-బీఏఎం) ఆధ్వర్యంలో సింగపూర్లో రవి కాంచిన పోతన భాగవతం పద్య పఠనపు పోటీలు – 2022 జరుగుతున్నాయి. తెలుగు భాగవత ప్రచార సమితి అంతర్జాతీయ శాఖ ద్వారా జరుగుతున్న ఈ పోటీల్లో సింగపూర్లో ఉన్న ఎవరైనా పాల్గొనవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీలో 2 రౌండ్స్ ఉంటాయి. మొదటి రౌండ్ పేరు పోతన, రెండో రౌండ్ గజేంద్ర రౌండ్.
పోతన రౌండ్ ఆగస్టు 6/7లలో జరుగుతుంది. ఈ పోటీలో విజేతలుగా నిలిచిన వారు గజేంద్ర రౌండ్కు అర్హత సాధిస్తారని చెప్పారు. పోటీ నియమ నిభందనలు తదితర వివరాల కోసం https://ibamcontests.blogspot.com/ వెబ్సైటును సందర్శించాలని తెలిపారు. పోటీలో పాల్గొనేందుకు https://bit.ly/ibam-potana-sg ఫాం ద్వారా నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు.