న్యూఢిల్లీ: కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలోని స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ నవోదయా విద్యాలయ సమితి (NVS) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1925 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో అసిస్టెంట్ కమిషనర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఆడిట్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్, జూనియర్ ఇంజినీర్ వంటి పోస్టులు ఉన్నాయి.
మొత్తం ఖాళీలు: 1925
ఇందులో అసిస్టెంట్ కమిషనర్ 5, అసిస్టెంట్ కమిషనర్ అడ్మిన్ 2, ఫీమేల్ స్టాఫ్ నర్స్ 82, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 10, ఆడిట్ ఆఫీసర్ 11, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ 4, జూనియర్ సివిల్ ఇంజినీర్ 1, స్టెనోగ్రాఫర్ 22, కంప్యూటర్ ఆపరేటర్ 4 క్యాటరింగ్ అసిస్టెంట్ 87, జూనియర్ అసిస్టెంట్ 630, ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్ 273, ల్యాబ్ అటెండెంట్ 142, మెస్ హెల్పర్ 629, ఎంటీఎస్ 23 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఒక్కో పోస్టుకు ఒక్కో విధంగా ఉన్నాయి. అయితే అభ్యర్థులు పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్టెస్ట్ ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: అసిస్టెంట్ కమిషనర్ రూ.1500, ఫీమేల్ స్టాఫ్ నర్స్ రూ.1200, ల్యాబ్ అటెండెంట్, మెస్ హెల్పర్, ఎంటీస్ పోస్టులకు రూ.750, ఇతర పోస్టులకు రూ.1000
దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 10
వెబ్సైట్: https://navodaya.gov.in/nvs