ఎల్లారెడ్డి రూరల్/సదాశివనగర్, ఫిబ్రవరి 1: అన్ని వర్గాల సంక్షేమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన కొనసాగుతున్నదని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో నాగిరెడ్డిపేట్ మండలానికి చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం 49 మందికి 49లక్షల 5వేల 685 విలువైన చెక్కులతోపాటు సొంత ఖర్చుతో పట్టుచీరలను బహూకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని యువకులు, మహిళలు, రైతులు, విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను గుర్తుచేశారు. కార్యక్రమంలో నాగిరెడ్డిపేట్ జడ్పీటీసీ మనోహర్రెడ్డి, ఎల్లారెడ్డి ఏఎంసీ చైర్మన్ కాశీనారాయణ, ఎంపీటీసీలు, సర్పంచులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
సదాశివనగర్ మండలంలోని ఉత్తనూరు గ్రామంలో కాంగ్రెస్, బీజేపీకి చెందిన 20 మంది యువకులు బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే సురేందర్ ఎల్లారెడ్డిలోని క్యాంపు కార్యాలయంలో గులాబీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎల్లారెడ్డి నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులపై ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ రాంచందర్రావు, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు శ్రీకాంత్, నాయకుడు శంకర్ నాయక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాదిక్ అలీ తదితరులు పాల్గొన్నారు.
సదాశివనగర్ మండలం యచారంలో నిర్వహించనున్న జగదాంబ, సేవాలాల్ ఆలయ ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్లను ఎమ్మెల్యే సురేందర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయానికి రూ.25 వేల విరాళం ఇచ్చారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేందర్రెడ్డి రూ.10,116 విరాళం అందజేశారు. కార్యక్రమంలో గిరిజన నాయకులు శ్రీనివాస్నాయక్, సురేందర్నాయక్, శంకర్నాయక్, రమేశ్నాయక్ తదితరులు పాల్గొన్నారు.