ఎల్లారెడ్డి రూరల్, డిసెంబర్ 31:ప్రజా సంక్షేమమే కేసీఆర్ ధ్యేయమని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి రూ. 64కోట్ల86లక్షల నిధులు మంజూరైనట్లు తెలిపారు. ఆర్అండ్బీ శాఖకు చెందిన అభివృధ్ధి పనులకు రూ. 37 కోట్ల 98 లక్షలు, గాంధారి మండలంలో బుగ్గగండి రోడ్డు నిర్మాణానికి రూ. 14 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. వైద్యశాఖకు రూ. 2 కోట్ల నిధులు వచ్చాయన్నారు. పలు గ్రామాల్లో హెల్త్ సబ్సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెపారు. మత్తమాల, ఎర్రాపహాడ్, రామారెడ్డి పీహెచ్సీల మరమ్మతులకు సుమారు రూ. 84 లక్షల నిధులు కేటాయించామన్నారు. నియోజకవర్గంలోని 56 గ్రామాల్లో గ్రామపంచాయతీ భవనాలకు రూ. 13 కోట్ల 20లక్షల నిధులు, నిర్మాణాలకు అనుమతులు లభించాయన్నారు. వరదలతో పాడైపోయిన రోడ్ల మరమ్మతులకు రూ. 8 కోట్ల 90 లక్షలు, 11 గ్రామాల పంచాయతీ రోడ్లకు రూ. 11 కోట్ల 94 లక్షలు ఇలా మొత్తం నియోజవర్గంలోని అభివృద్ధి పనులకు రూ. 64 కోట్ల 86 లక్షల నిధులు వచ్చాయన్నారు. ఎంపీ జోగినిపల్లి సంతోష్కుమార్ నిధుల నుంచి రూ. 20లక్షలు కమ్యూనిటీ భవనాల కోసం వచ్చాయన్నారు.
ఎల్లారెడ్డి పట్టణ ప్రజల ప్రధాన సమస్య అయిన బస్టాండ్ నిర్మాణాన్ని వ్యాపారుల కోరిక మేరకు నూతన సంవత్సరంలో ప్రారంభిస్తామన్నారు. నాగిరెడ్డిపేట్ బస్టాండ్ను సుమారు రూ. 16 లక్షలు, లింగంపేట్ బస్టాండ్ను రూ. 40 లక్షల నిధులతో మరమ్మతులు చేపడుతున్నామన్నారు. అభివృద్ధి అంతా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే సాధ్యమవుతోందని అన్నారు. ఎల్లారెడ్డి పెద్దచెరువు కట్టకు రెండు బ్రిడ్జిల నిర్మాణం చేసి వానకాలంలో రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసుకొని పట్టణ ప్రజల ప్రధాన సమస్యను తొలగించామని అన్నారు. కొందరు జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఎల్లారెడ్డిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై తాను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నానని ప్రతిపక్షాలకు తాను చాలెంజ్ చేస్తున్నానన్నాని అన్నారు. పెండింగ్లో ఉన్న పనులను సైతం పూర్తి చేస్తున్నట్లు తెలిపారు.
నియోజకవర్గ అభివృద్ధికి తాను అడిగిన వెంటనే నిధులు మంజూరు చేస్తున్న సీఎం కేసీఆర్, అండగా నిలుస్తున్న స్పీకర్ పోచారం, మంత్రులు కేటీఆర్, ప్రశాంత్రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నియోజకవర్గ ప్రజలకు నూతన సంవతర్సర శుభాకాంక్షలు తెలిపారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జలంధర్రెడ్డి, ఎల్లారెడ్డి, వెల్లుట్ల సొసైటీ చైర్మన్లు ఏగుల నర్సింహులు, పటేల్ సాయిలు, పట్టణ అధ్యక్షుడు ఆదిమూలం సతీశ్కుమార్, నాయకులు కాశీ నారాయణ, నునుగొండ శ్రీనివాస్, ఎరుకల సాయిలు, చింతల శంకర్, లక్ష్మాపూర్ సర్పంచ్ రవీందర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.