కామారెడ్డి,నవంబర్ 9 : ప్రజాఆశీర్వాద సభలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సహకారంతో కామారెడ్డి నియోజకవర్గంలో రూ. 1965 కోట్లు ఖర్చు పెట్టి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసుకున్నామన్నారు. కేసీఆర్ ఆశీస్సులతోనే కామారెడ్డిని జిల్లా కేంద్రంగా చేసుకున్నామన్నారు. ఇక్కడి ప్రజల చిరకాల వాంఛ అయిన మెడికల్ కళాశాలను ఇటీవలే ప్రారంభించుకున్నామన్నారు. తాను కేసీఆర్ ఆశీర్వాదంతోని 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానన్నారు. కామారెడ్డి ప్రజలు ఇంకా అభివృద్ధి కోరుకుంటున్నారని.. సీఎం కేసీఆర్ ఇక్కడి నుంచి పోటీ చేస్తే మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.
అడిగిన వెంటనే కేసీఆర్ ఇక్కడి నుంచి పోటీ చేయడానికి ఒ ప్పుకున్నారని తెలిపారు. కాళేశ్వరం ప్యాకేజీ -22, ఇంజినీరింగ్ కళాశాల, దోమకొండ మున్సిపాలిటీగా మార్పు, రాజంపేటలో జూనియర్ కళాశాల ఏర్పాటు వం టి అభివృద్ధి పనులు జరగాల్సి ఉన్నాయన్నారు. కేసీఆర్ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.ఇక్కడి ప్రజలు గుండెలో పెట్టుకొని లక్ష మెజార్టీతో గెలిపిస్తారని అన్నా రు. అంతకు ముందు రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్, బీ ఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు సీఎం కేసీఆర్కు దట్టి కట్టారు.
కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న అనంతరం బాన్సువాడ మాజీ ఎమ్మెల్యే కత్తెర గంగాధర్, బీబీపేట్ వాసి, వ్యాపారవేత్త తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి సీఎం కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.