నందిపేట్, జనవరి 17: ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రైతు డిక్లరేషన్ను అమలు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నా రు. నెలాఖరులోపు రైతుబంధు ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు. ఆర్థికంగా కష్టమైనా రుణమాఫీ ప్రక్రియ కూడా చేపడతామన్నారు. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం ఆంధ్రనగర్లో ఏర్పాటుచేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని మంత్రి తుమ్మల బుధవారం ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్ శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చిన తాను రైతు పక్షపాతిని అని, ఎన్టీఆర్ ఆశయాలకు అణుగుణంగా రైతుల కోసం పని చేస్తానన్నారు.
రైతుల అవసరాలు, కష్టాలు తీర్చడానికి, అన్నదాతల భవిష్యత్తు కోసం ఎంత కష్టమైనా, ఇబ్బంది అయి నా రైతు డిక్లరేషన్లో ప్రకటించిన హామీలన్నీ అమలు చేస్తామని చెప్పారు. ఇప్పటికే రెండు ఎకరాల్లోపు భూమి ఉన్న 29 లక్షల మందికి రైతుబంధు డబ్బులు ఖాతాల్లో పడ్డాయని తెలిపారు. మిగతా వారికి సైతం ఈ నెలాఖరులో పూర్తి చేస్తామన్నారు. రూ.2 లక్షల పంట రుణం ఒకేసారి మాఫీ చేయడం ప్రభుత్వానికి కష్టమే అయినప్పటికీ, ముఖ్యమంత్రి ఆలోచన, పద్ధతి ప్రకారంగా కొద్ది రోజుల్లోనే రుణమాఫీ చేస్తామన్నారు. ఎన్టీఆర్ ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చిన తాము రైతుల అవసరం కోసం పనిచేస్తామన్నారు. జడ్పీ చైర్మన్ విఠల్రావు, ఎమ్మెల్యేలు పైడి రాకేశ్రెడ్డి, సుదర్శన్రెడ్డి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావ్ పాల్గొన్నారు