రెంజల్, మార్చి 8: ఒకటో తరగతి నుంచి పీజీ వరకు నాణ్యమైన విద్య, అందుకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించేందుకు సీఎం రేవంత్రెడ్డి కట్టుబడి ఉన్నారని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో రూ. 18కోట్లతో నిర్మించిన మైనార్టీ ఉర్దూ కళాశాల, పాఠశాల భవనాన్ని ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి శుక్ర వారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తమ లక్ష్యాన్ని సాధించేందుకు విద్య ఎంతో దోహదపడుతుందని అన్నారు.
అంత కుముందు తహసీల్ కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్హందాన్, ఆర్డీవో రాజాగౌడ్, జడ్పీటీసీ విజయ పాల్గొన్నారు.