సిటీబ్యూరో, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నదని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈ నెల 21న జరిగే కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరవుతారని అన్నారు. శుక్రవారం ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్, ఎమ్మెల్సీ రాజేశ్వర్రావు, ఎమ్మెల్యే స్టీఫెన్ సన్, ఐఏఎస్ అధికారులు నదీం అహ్మద్, విజయ్ కుమార్, హరివిందర్సింగ్, వక్ఫ్ బోర్డు చైర్మన్ సలీం, నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్, ఐపీఎస్ అధికారులు విజయ్ కుమార్ చౌహాన్తో కలిసి వేడుకల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. క్రిస్మస్ త వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని తెలిపారు. సీఎం కేసీఆర్ పలువురిని సన్మానిస్తారని పేర్కొన్నారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు శ్రమించాలని కోరారు. గ్యాలరీలు, ఎల్ఈడీ తెరల ఏర్పాటు, స్వాగతతోరణాల లాంటి పను ల్లో వేగం పెంచాలని సూచించారు. కార్యక్రమంలో ఉత్సవాల కమిటీ సభ్యులు రాయడిన్ రోచ్, రాజీవ్ సాగర్, శంకర్ లూక్, పోలీసు, రెవెన్యూ, వైద్యారోగ్య, విద్యుత్, జీహెచ్ఎంసీ, వాటర్వర్క్స్ శాఖల అధికారులు పాల్గొన్నారు.