కమ్మర్పల్లి. డిసెంబర్ 3 : వేముల ప్రశాంత్రెడ్డి బాల్కొండ ఎమ్మెల్యేగా గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి ముత్యాల సునీల్కుమార్పై 4,533 ఓట్ల మెజారిటీ సాధించారు. 2014, 2018 ఎన్నికల్లో జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో విజ యం సాధించిన ప్రశాంత్ రెడ్డి.. బాల్కొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు.
కేసీఆర్కు అత్యంత విశ్వసనీయుడిగా ఎదిగి ఆయన సహకారంతో నియోజక వర్గాన్ని కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి చేశారు. అభివృద్ధికి మారు పేరుగా బాల్కొండ నియోజక వర్గాన్ని తీర్చిదిద్ది మూడోసారి ఘన విజయం సాధించారు. మొత్తం 70,417 వేల ఓట్లు సాధించి తన సమీప అభ్యర్థిపై విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్కు 65,884 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ఏలేటి అన్నపూర్ణమ్మకు 30,250 ఓట్లు వచ్చాయి.