మోర్తాడ్, నవంబర్ 14: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని తెలిపారు. ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుని ముందుకుపోతామని ఎమ్మెల్యే వేము ల పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ ఎన్నికల్లో అధికార యంత్రాంగం, ఇతర వ్యవస్థలన్నింటిని కాంగ్రెస్ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి విచ్చలవిడిగా దొంగ ఓట్లు వేస్తున్నా పోలీసులు, ఎన్నికల కమిషన్ చోద్యం చూస్తూ ఉండిపోయానని పేర్కొన్నారు. సాంకేతికంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినా.. నైతిక విజ యం మాత్రం బీఆర్ఎస్దే అని తెలిపారు. ఓటమిని సవాల్గా తీసుకుంటామని, ఎన్నికల సందర్భంగా కాం గ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజల పక్షాన పోరాటాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు.
తాను ఇన్చార్జిగా ఉన్న షేక్పేట్ డివిజన్లోని 12 బూత్లలో బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు బాధ్యత తీసుకుని 1,073 ఓట్ల మెజారిటీ తీసుకురావడం, అన్ని బూత్లలో బీఆర్ఎస్కు ఎక్కువ ఓట్లు రావడం గొప్ప విషయమని తెలిపారు. ఈ సందర్భంగా నెలరోజులుగా అక్కడే ఉంటూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోసం ప్రచారం నిర్వహించిన బాల్కొండ నియోజకవర్గ నాయకులను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు.