Bajireddy Goverdhan | కోటగిరి , ఆగస్టు 7 : ‘పులోరియా.. పులోరియా..’ అంటూ భక్తుల హోరుతో కోటగిరి మండల కేంద్రం పూనితమైంది. పోతరాజుల చిందులు, శివసత్తుల పూనకాలు, తొట్టేల ఊరేగింపుతో సందడి నెలకొంది. కోటగిరి మండల కేంద్రంలోఊర పండుగను పురస్కరించుకొని కోటగిరి శుక్రవారం జన సంద్రంగా మారింది. ఊర పండగ సందర్భంగా ప్రధానమైన పదార్థం సరిని కోటగిరి వాసులు తమ ఇండ్లు, పొలాల్లో ఎంతో భక్తి ప్రపత్తులతో చల్లుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగా పండాలని కోరుతూ గ్రామ దేవతలకు కోటగిరి వాసులు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.
ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
కోటగిరి మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ఊర పండుగ వేడుకల్లో నిజామాబాదు రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడిపంటలు బాగుండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామాలు జరిగే ఊర పండగ గ్రామ దేవతల జాతర ప్రజల మధ్య ఐక్యత, ప్రకృతి, సంస్కృతిని కాపాడే ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక వేడుక అని గుర్తు చేశారు. వర్షాలు బాగా కురవాలని పాడిపంటలు సమృద్ధిగా పండాలని గ్రామానికి ఎలాంటి రోగాలు, కష్టాలు రాకుండా గ్రామ దేవతలను వేడుకుంటూ ఈ పండుగ జరుపుకుంటారని తెలిపారు.

పలువురి యువకుల బీఆర్ఎస్లో చేరిక
కోటగిరి మండల కేంద్రంలో నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సమక్షంలో కోటగిరికి చెందిన పలువురు యువ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ ఆ యువకులకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, పార్టీ కోసం ప్రతీ ఒక్కరూ సైనికుడిగా పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బాన్స్ వాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్, రైతుబంధు మాజీ జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, నార్ల రత్న కుమార్, యలమంచిలి శ్రీనివాస్, మోరిల్ శ్రీనివాస్, కోటగిరి మండల నాయకులు తెల్ల రవికుమార్, పోతంగల్ మండల నాయకులు సూధం నవీన్ కుమార్, చందూర్ సర్పంచ్ మాధవరెడ్డి, కప్ప రాజయ్య, కర్నె గజేందర్, కప్ప సంతోష్,శంకర్ గౌడ్, బొట్టే గజేందర్, నజీర్, గంగాప్రసాద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.