ఖలీల్వాడి, డిసెంబర్ 26: నగరంలోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల కేంద్ర మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఎస్టీ యువతకు పరిశ్రమల ఏర్పాటుపై మంగళవారం అవగాహన కల్పించారు. ఎంఎస్ఎంఈ, డీఎఫ్వో హైదరాబాద్ డీడీ రాజేశ్కుమార్ యాదవ్ హాజరై శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి ఆర్థికసాయం, ముడిసరుకుల సరఫరా, మార్కెటింగ్ కోసం సహకారం అందిస్తామన్నారు. కుల వృత్తుల వారికి ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం కింద రూ. లక్ష వరకు గ్యారంటీ లేని రుణాలు పంపిణీ చేస్తామన్నారు.