భీమ్గల్, జనవరి 11: మండలంలోని చేంగల్ రైతువేదికలో ఆయిల్పామ్ పంట సాగుపై సహాయ వ్యవసాయ సంచాలకుడు మల్లయ్య రైతులకు బుధవారం అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ ఆయిల్పామ్ పంట ద్వారా రైతులకు ఎకరాకు 50 మొక్కలు రాయితీపై ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి సాయికృష్ణ, ఉద్యావనన శాఖ అధికారి సుమన్, చేంగల్ సర్పంచ్ చిన్నారెడ్డి, రైతుబంధు సమితి గ్రామ కోఆర్డినేటర్లు మోహన్, లింబన్న, ఎంపీటీసీలు లక్ష్మీ గజేంద్రగౌడ్, ఏఏవోలు పాల్గొన్నారు.
ఎడపల్లి, జనవరి11: ఆయిల్పామ్ పంటసాగుపై జైతాపూర్ గ్రామంలో వివిధ గ్రామాల రైతులకు మండల వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించారు. సమావేశంలో ఎంపీపీ కొండెంగల శ్రీనివాస్, సర్పంచ్ శ్రీ లక్ష్మి, జైతాపూర్ సొసైటీ చైర్మన్ మిద్దె నరేందర్, ఏవో సిద్దిరామేశ్వర్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
ఆర్మూర్, జనవరి 11: చేపూర్ గ్రామంలో వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు ఆయిల్పాం సాగుపై అవగాహన కల్పించారు. ఆర్మూర్ వ్యవసాయ శాఖ సంచాలకురాలు విజయలక్ష్మి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆయిల్పాం సాగు చేసే రైతులకు మొక్కలు, డ్రిప్ పరికరాలు సబ్సిడీపై అందజేస్తోందన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి హరికృష్ణ, సర్పంచ్ సాయన్న, ఉప సర్పంచ్ శ్రీనివాస్, గంగారెడ్డి, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు రిక్కల రాజు పాల్గొన్నారు.
బోధన్ రూరల్, జనవరి 11: రైతులు వరికి బదులు అధిక లాభం వచ్చే ఆయిల్పామ్ సాగును చేపట్టాలని ఉద్యానవన శాఖ అధికారి వాహిద్ అన్నారు. బోదన్ మండలంలోని శ్రీనివాస్క్యాంప్ శివారులో పామాయిల్ సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం ః శ్రీనివాస్క్యాంప్ శివారులో సాగు చేస్తున్న పామాయిల్ పంటను పరిశీలించారు. కార్యక్రమంలో ఏఈవోలు సాయిలు, ముజామిల్, సర్పంచులు, రైతులు ఉన్నారు.
మాక్లూర్, జనవరి10: అడవిమామిడిపల్లి గ్రామంలో రైతు మాస్త సునీత నాలుగెకరాల్లో ఆయిల్పామ్ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎంపీపీ మాస్త ప్రభాకర్, ఏవో పద్మ, రైతులతో కలిసి ప్రారంభించారు. ఎంపీడీవో జైక్రాంతి, ఏఈవో ఉమాదేవి, సర్పంచ్ చింత మల్లారెడ్డి, ఎస్సై యాదగిరిగౌడ్, ఈజీఎస్ టీఏలు, ఎఫ్ఏలు పాల్గొన్నారు.
రెంజల్, జనవరి 11: దీర్ఘ కాలిక లాభాలు వచ్చే ఆయిల్పామ్ పంటను సాగు చేయాలని ఏవో లక్ష్మీకాంత్రెడ్డి రైతులను కోరారు. బుధవారం మండలం తాడ్బిలోలి శివారులో రైతులు కృష్ణారెడ్డి, కృష్ణ, సురేశ్ రైతులు సాగు చేస్తున్న ఆయిల్ పామ్, అంతర్ పంటలను పరిశీలించారు. మండలంలో 200 ఎకరాల్లో రైతులు ఆయిల్పామ్ పంటను సాగు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పంటలో అంతర పంటగా శనగ, ఉల్లి, మునగ, వంకాయ, మిర్చి, చిక్కుడు, టమాట, సోయా వంటి పంటల సాగు రైతులకు లాభాలు వస్తాయని అన్నారు. ప్రభుత్వం రాయితీపై అందించిన స్ప్రింక్లర్లు, సాగవుతున్న పంటలను పరిశీలించామని అన్నారు. ఆయిల్ పామ్ పంట సాగుకు ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నదని, కల్పిస్తున్న గొప్ప అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా డైరెక్టర్ మౌలానా, రైతు బంధు సమితి గ్రామ కోఆర్డినేటర్ హన్మంత్రావు, ఏఈవోలు అజయ్, గోపి కృష్ణ, ప్రసాద్, భాగ్యశ్రీ, రచన, రైతులు పాల్గొన్నారు.