బోధన్ రూరల్, మే 16: తల్లి మరణాన్ని తట్టుకోలేక కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బోధన్ మండలంలోని ఖండ్గామ్ గ్రా మంలో బుధవారం చోటు చేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్ర కారం.. గ్రామానికి చెందిన మిసాలే పద్మినీబాయి (60) మంగళవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందింది.
కుమారుడైన సునీల్ దేవ్ (35) తన తల్లి మృతిని తట్టుకోలేక బుధవారం ఉదయం ఇంట్లో దూలానికి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గంటల వ్యవధిలో తల్లి, కుమారుడు చనిపోవడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సునీల్దేవ్ వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడని, తల్లి మరణాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకోవడంతో స్నేహితులు, కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. సునీల్దేవ్కు భార్య ఉన్నది.