బాన్సువాడ, జూన్ 30: దశాబ్దాల పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి పట్టాలు పంపిణీ చేసిన దమ్మున్న సీఎం కేసీఆర్ అని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడలోని కొల్లూర్ రోడ్డులో ఉన్న ఎస్ఎంబీ ఫంక్షన్హాలులో శుక్రవారం ఏర్పాటుచేసిన గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డితో కలిసి పాల్గొన్నారు. స్పీకర్ మాట్లాడుతూ.. గతంలో భూమిని దున్నడానికి వెళ్లిన రైతులు, అటవీశాఖ అధికారుల మధ్య గొడవలు జరిగేవని గుర్తుచేశారు. వాటన్నింటికీ ఫుల్స్టాప్ పెడుతూ సీఎం కేసీఆర్..పోడు భూముల సమస్యకు పరిష్కారం చూపారని తెలిపారు. ప ట్టాలు అందుకున్న గిరిజనులు ఇకనుం చి ధైర్యంగా పంటలను సాగుచేసుకోవచ్చని సూచించారు. దశాబ్దా ల సమస్యకు పరిష్కారం చూపు తూ పోడు భూములకు పట్టాలను ఇప్పించిన సీ ఎం కేసీఆర్కు బంజారాల తరఫున కృ తజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో లక్షా 50 వేల మంది గిరిజనులకు 4 లక్షల 5 వేల ఎకరాలు పోడు భూములకు పట్టాలు అందిస్తున్నట్లు తెలిపారు.
అర్హులందరికీ పట్టాలు..
బాన్సువాడ నియోజక వర్గంలో 2001 మంది గిరిజన రైతులకు నాలుగు వేల ఎకరాల పోడు భూములకు పట్టాలు అందించినట్లు వివరించారు. ఇంకా ఎవరైనా ఉంటే సర్వే చేయించి అర్హులకు గిరిజనులకు పట్టాలు అందిస్తామని చెప్పారు. ఎటువంటి పైరవీలు, సిఫారసులు లేకుండా అర్హులైన బంజారాలకు పట్టాలు అందుతున్నాయని తెలిపారు. పోడు భూములకు ఇతర రైతులకు మాదిరిగానే రైతుబంధు, రైతుబీమా వర్తిస్తుందన్నారు. పండించిన ధా న్యాన్ని అమ్ముకోవడానికి పాస్పుస్తకం ద్వారా అర్హత లభిస్తుందని తెలిపారు. బోర్లు వేసుకొని విద్యుత్ కనెక్షన్ తీసుకోవచ్చన్నారు.
గిరిజనులు కష్టపడుతారని, చెమటోడ్చి పంటలు పండిస్తారని అభినందించారు. పట్టాలు పంపిణీ చేసిన నాలుగు వేల ఎకరాలు భూ ముల విలువ రూ. వెయ్యికోట్లు ఉంటుందని తెలిపారు. స్వరాష్ట్రంలో గిరిజనులకు రిజర్వేషన్ 6 శాతం నుంచి 10 శాతానికి పెంచారని తెలిపారు. వర్ని మండలంలో నిర్మిస్తున్న సిద్ధాపూర్ రిజర్వాయర్ నిర్మాణంతో 30 తండాల్లోని గిరిజనులకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ సందర్భంగా గిరిజన రెసిడెన్షియల్ చిన్నారులు చేసిన నృత్యాలు ఆలరించాయి. అనంతరం బంజారాలతో కలిసి స్పీకర్ సహపంక్తి భోజనాలు చేశారు. అంతకుముందు ఫంక్షన్హాలులో ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ చిత్రపటానికి గిరిజనులతో కలిసి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి క్షీరాభిషేకం చేశారు. భోగ్భండార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంత్ సేవాలాల్ మహరాజ్ చిత్రపటం వద్ద పూజలు నిర్వహించారు.
సాయిచంద్ మృతికి సంతాపం
రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, గాయకుడు సాయిచంద్ మృతికి స్పీకర్ సంతాపం తెలిపారు. ఆయన మృతి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సభలో రెండు నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, బంజారా సంఘం జిల్లా అధ్యక్షుడు బద్యానాయక్, ఆత్మ కమిటీ చైర్మన్ మోహన్ నాయక్, ఉమ్మడి జిల్లాల గిరిజన అభివృద్ధి శాఖాధికారి శ్రీనివాస్ రెడ్డి, నాగుబాబు, ఆర్డీవో రాజాగౌడ్, రాజేశ్వర్, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, వైస్ చైర్మన్ షేక్ జుబేర్, సొసైటీ చైర్మన్ ఏర్వాల కృష్ణారెడ్డి, ఎంపీపీ దొడ్ల నీరజ, జడ్పీటీసీలు పద్మ, హరిదాస్, జన్నూబాయి, డీసీసీబీ డైరెక్టర్ సంగ్రాం నాయక్, కవిత, ఏఎంసీ చైర్మన్ నర్సింహులు, వైస్ చైర్మన్ రాజు తదితరులు పాల్గొన్నారు.