నిజామాబాద్ క్రైం, జూలై 15 : రాష్ట్రంలో త్వరలో నిర్వహించనున్న ఎన్నికల సందర్భంగా పోలీస్ శాఖలో భారీగా బదిలీలు చేపట్టారు. జోన్-2 బాసర పరిధిలోని వివిధ జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న సబ్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ మల్టీ జోన్-1 ఐజీ చంద్రశేఖర్రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో మొత్తం 91 మంది సిబ్బందిని బదిలీ చేశారు. ఇందులో నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో 47 మంది ఎస్సైలకు స్థానచలనం కలిగింది.